Visakhapatnam: ప్రియుడితో వచ్చింది… వాడు పరార్.. ప్రేయసి బేజార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakhapatnam: ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ముఖపరిచయం లేని వ్యక్తులతో పరిచయం పెంచుకుంటున్నారు. ఆ పరిచయానికి ప్రేమ అనే పేరు పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో ఆకర్షణకి ప్రేమకి మధ్య తేడా తెలుసుకోలేక కొందరు యువతీ యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి తన ప్రియుడితో కలిసి బీచ్ కి వెళ్ళింది. ఈ క్రమంలో ప్రమాదానికి గురైంది. దీనితో ఆ యువతికి ఏదైనా జరిగితే నేరం తన పైకి వస్తుందనుకున్నాడో ఏమో గాని ఆ యువతితో అంబులెన్సు తీసుకొస్తా అని చెప్పి పరారైయ్యాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. మచిలీపట్నం కావ్య అనే యువతి భీమవరంకి చెందిన ఫణింద్ర వర్మ రాజు అనే యువకుడితో కలిసి అప్పికొండ బీచ్ కి వచ్చింది. ఈ నేథ్యంలో ఈ జంట ఈ నెల 2వ తేదీ నుండి అప్పికొండ సముద్ర తీరంలో ఉన్న కొండ పై నివాసం వుంటున్నారు. పగలంతా విశాఖలో తిరుగుతూ రాత్రి సమయంలో కొండపై నిద్రిస్తున్నారు.
Read also:America : ప్రపంచంలో రెండో అతి పెద్ద హిందూ దేవాలయం.. అమెరికాలో ప్రారంభం
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
అయితే అమ్మాయి ప్రమాదవశాత్తు కొండ పైన నుండి జారిపడి రాళ్ళ మధ్య చిక్కుకుపోయింది. దీనితో ఆ యువకుడు అంబులెన్సు తీసుకు వస్తానని చెప్పి అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు, బంగారం తీసుకుని పరారైయ్యాడు. అయితే రాళ్ల మధ్య చిక్కుకున్న యువతిని చూసిన జాలర్లు ఆమెను అతి కష్టం పైన బయటకు తీశారు. అయితే అక్కడకి ఎవరితో వచ్చావు అని జాలర్లు అడగగా వర్మ వెంట వచ్చానని చెప్పడానికి మొదట సందేహిచింది. అయితే చివరికి జరిగింది చెప్పింది. జాలర్లు వాళ్ళ ఫోన్ నుండి వర్మకి కాల్ చేయాగా వర్మ అంబులెన్సు పంపించాడు. కానీ తాను రాలేదు. అయితే కూతురు మిస్ అయిందని గత నెలలో యువతి తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో యువతి గురించి ఆమె తల్లిదండ్రులకి సమాచారం అందించారు పోలీసులు. ఈ ఘటన గురించి Ntv తో మాట్లాడిన యువతి, యువతి తల్లి అసలు జరిగిన విషయాన్ని తెలిపారు.
Read also:Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారం పట్టివేత.. ప్రయాణికుడు అరెస్ట్.
Ntvకి బాధితులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. యువతి ఫ్యామిలీ తో షిరిడికి ట్రైన్ లో వెళ్తున్నపుడు భీమవరం చెందిన ఫణింద్ర వర్మ రాజు తో పరిచయం ఏర్పడింది. కాగా అతను రిలయన్స్ మార్ట్ లో పని చేస్తున్నాడు.. ఫేస్ బుక్ ద్వారా పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో యువతి తన ప్రియుడితో కలిసి గత నెల 29 వ తేదీన ఇంటి నుండి వచ్చేసింది. ఈ క్రమంలో బైక్ మీద భీమవరం వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. కాగా ఈ నెల 7వ తేదీన వైజాగ్ వచ్చారు. ఈ నేపధ్యంలో ఆదివారం అప్పి కొండ బీచ్ కు వెళ్లారు. ఈ క్రమంలో యువతి ప్రమాదానికి గురికాగా యువకుడు అంబులెన్సు తీసుకు వస్తాను అని చెప్పి యువతి దగ్గర ఉన్న రూ/ 7 వేలు డబ్బులు, లక్షా 70 వేలు విలువ చేసే బంగారం తీసుకుని ఉడాయించాడు. అయితే రాళ్ల మధ్యన ఇర్రుకుని అపస్మారక స్థితిలో ఉన్న యువతిని జాలర్లు కాపాడి వాళ్ళ ఫోన్ తో వర్మకి కాల్ చేయగా అంబులెన్సు పంపించాడు.
తాజావార్తలు
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!