Gudivada Mystery Case: మొదట అబ్బాయి అదృశ్యం.. ఆ తర్వాత ఎదురింట్లో ఆంటీ మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Married Woman In Gudivada Went Missing Along With The Boy: ఇది ఎవ్వరూ ఊహించని, ఎవ్వరికీ అంతుచిక్కని ఒక మిస్టరీ కేసు. ఆంధ్రప్రదేశ్ గుడివాడలోని గుడ్మెన్ పేట కాలనీలో ఈ కేసు వెలుగు చూసింది. అసలు మేటర్ ఏమిటంటే.. ఆ కాలనీలో ఉంటోన్న 15 ఏళ్ల బాలుడు రీసెంట్గా అదృశ్యమయ్యాడు. బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఆ అబ్బాయి.. ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో.. స్నేహితుల వద్దకు వెళ్లాడేమోననుకొని, వారిని సంప్రదించారు. వాళ్లు కూడా తమ వద్ద లేడని చెప్పారు. దాంతో టెన్షన్ పడ్డ బాలుడి తల్లిదండ్రులు.. చుట్టుపక్కల గాలించారు. ఎక్కడా జాడ కనిపించకపోయేసరికి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. కిడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఈ నేపథ్యంలోనే ఓ షాకింగ్ ట్విస్ట్ తెరమీదకొచ్చింది. ఎదురింట్లో ఉంటోన్న ఆంటీ సైతం మాయమైనట్టు ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆమెకు పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి ఆమె, బాలుడు అదృశ్యమయ్యాక కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరేమో.. ఆ మైనర్ బాలుడు, ఈ వివాహిత మధ్య అక్రమ సంబంధం ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ, ఆ అబ్బాయి కుటుంబీకుల వాదన మాత్రం మరోలా ఉంది. డబ్బుల కోసమే తమ బాలుడ్ని అపరహరించిందని పేర్కొంటున్నారు. మాయమాటలు చెప్పి, తమ పిల్లాడ్ని ఆమె ఎత్తుకెళ్లిందని చెప్తున్నారు. ఇది కచ్ఛితంగా కిడ్నాప్ వ్యవహారమేనని, ఆ వివాహిత ఆచూకీ కనుగొని తమ పిల్లాడ్ని తమకు అప్పగించాలని బాలుడి తల్లిదండ్రులు పోలీసుల్ని వేడుకుంటున్నారు.
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అటు, పోలీసులకు ఈ కేసు అంతుపట్టడం లేదు. బాలుడి కుటుంబ సభ్యులు చెప్తున్నట్టు.. ఎదురింట్లో ఉండే వివాహిత ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసిందా? లేక స్థానికులు అనుమానిస్తున్నట్టు వాళ్లు ఎఫైర్లో ఉన్నారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో భాగంగా.. వివాహిత ఏవో మాటలు చెప్పి, బాలుడ్ని తీసుకెళ్లి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు.. బాలుడి ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇస్తామని అతని పేరెంట్స్ చెప్తున్నారు. మరి, ఈ మిస్టరీ కేసు ఎప్పుడు వీడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!