Gudivada Mystery Case: మొదట అబ్బాయి అదృశ్యం.. ఆ తర్వాత ఎదురింట్లో ఆంటీ మాయం
A Married Woman In Gudivada Went Missing Along With The Boy: ఇది ఎవ్వరూ ఊహించని, ఎవ్వరికీ అంతుచిక్కని ఒక మిస్టరీ కేసు. ఆంధ్రప్రదేశ్ గుడివాడలోని గుడ్మెన్ పేట కాలనీలో ఈ కేసు వెలుగు చూసింది. అసలు మేటర్ ఏమిటంటే.. ఆ కాలనీలో ఉంటోన్న 15 ఏళ్ల బాలుడు రీసెంట్గా అదృశ్యమయ్యాడు. బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఆ అబ్బాయి.. ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో.. స్నేహితుల వద్దకు వెళ్లాడేమోననుకొని, వారిని సంప్రదించారు. వాళ్లు కూడా తమ వద్ద లేడని చెప్పారు. దాంతో టెన్షన్ పడ్డ బాలుడి తల్లిదండ్రులు.. చుట్టుపక్కల గాలించారు. ఎక్కడా జాడ కనిపించకపోయేసరికి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. కిడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఈ నేపథ్యంలోనే ఓ షాకింగ్ ట్విస్ట్ తెరమీదకొచ్చింది. ఎదురింట్లో ఉంటోన్న ఆంటీ సైతం మాయమైనట్టు ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆమెకు పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి ఆమె, బాలుడు అదృశ్యమయ్యాక కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరేమో.. ఆ మైనర్ బాలుడు, ఈ వివాహిత మధ్య అక్రమ సంబంధం ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ, ఆ అబ్బాయి కుటుంబీకుల వాదన మాత్రం మరోలా ఉంది. డబ్బుల కోసమే తమ బాలుడ్ని అపరహరించిందని పేర్కొంటున్నారు. మాయమాటలు చెప్పి, తమ పిల్లాడ్ని ఆమె ఎత్తుకెళ్లిందని చెప్తున్నారు. ఇది కచ్ఛితంగా కిడ్నాప్ వ్యవహారమేనని, ఆ వివాహిత ఆచూకీ కనుగొని తమ పిల్లాడ్ని తమకు అప్పగించాలని బాలుడి తల్లిదండ్రులు పోలీసుల్ని వేడుకుంటున్నారు.
Also Read
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
- Off The Record : ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ సైలెంట్ వార్.. సొంత నేతలే చెక్ పెడుతున్నారా?
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అటు, పోలీసులకు ఈ కేసు అంతుపట్టడం లేదు. బాలుడి కుటుంబ సభ్యులు చెప్తున్నట్టు.. ఎదురింట్లో ఉండే వివాహిత ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసిందా? లేక స్థానికులు అనుమానిస్తున్నట్టు వాళ్లు ఎఫైర్లో ఉన్నారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో భాగంగా.. వివాహిత ఏవో మాటలు చెప్పి, బాలుడ్ని తీసుకెళ్లి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు.. బాలుడి ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇస్తామని అతని పేరెంట్స్ చెప్తున్నారు. మరి, ఈ మిస్టరీ కేసు ఎప్పుడు వీడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!