LoanApp Harassment: లోన్యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలి.. భార్యకి మార్ఫింగ్ ఫోటోలు పెట్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Man Commits Suicide Due To LoanApp Harassment In Vijayawada: లోన్యాప్ వేధింపులకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. తీసుకున్న డబ్బులు నిర్దేశించిన సమయంలో తిరిగి ఇవ్వకపోతే.. బాధితుల్ని తీవ్రంగా హింసిస్తున్నారు. బూతులు తిట్టడమే కాదు.. వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి మరీ వేధిస్తున్నారు. తమకు కొంచెం సమయం ఇవ్వమని రిక్వెస్ట్ చేసినా.. వాళ్లు కనికరించడం లేదు. దుర్మార్గుల్లాగా వ్యవహరిస్తున్నారు. మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నారు. ఇలా కుంగిపోయిన బాధితుల్లో ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇప్పుడు తాజాగా మరో వ్యక్తి ఈ లోన్యాప్ వేధింపులకు బలి అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Jr NTR: తారకరత్న పోరాడుతున్నారు.. మీడియాతో జూ. ఎన్టీఆర్
Also Read
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
విజయవాడలోని సూరయపలెంలో గ్రామానికి చెందిన తంగెళ్ళమూడి రాజేష్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం లోన్యాప్లో రుణం తీసుకున్నాడు. అయితే.. ఆర్థిక సమస్యల కారణంగా అతడు సరైన సమయానికి డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయాడు. ఇక అప్పటి నుంచి లోన్యాప్ నిర్వాహకులు రాజేష్ని వేధించడం మొదలుపెట్టారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేసి భార్యకి పెడదామని బెదిరించారు. తనకు కొంత సమయం ఇవ్వమని ఎంత వేడుకున్నా.. వాళ్లు వినలేదు. చివరికి నిర్వాహకులు అన్నంత పని చేశారు. రాజేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి.. అతని భార్య రత్నకు పంపించారు. ఆ ఫోటోలను వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో తీవ్ర అవమానంగా భావించిన రాజేష్.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన భార్యకు ఫోన్ చేసి బోరున విలపించాడు. భార్య ఇంటికి వచ్చేసరికి.. రాజేష్ ఉరివేసుకొని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై రత్న పోలీసుల్ని ఆశ్రయించగా.. వాళ్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Volodymyr Zelenskyy: ట్విస్ట్ ఇచ్చిన జెలెన్స్కీ.. రష్యాకి ఊహించని దెబ్బ
రాజేష్ భార్య రత్న మాట్లాడుతూ.. తన భర్త లోన్ తీసుకున్న విషయం తనకు తెలియదని పేర్కొంది. తన మొబైల్ నంబర్ లోన్యాప్ నిర్వాహకులకు ఎలా తెలిసిందో తెలీదని తెలిపింది. లోన్యాప్ వాళ్లు తనకు పదేపదే కాల్స్ చేసి బెదిరించారని చెప్పింది. తన భర్త మార్ఫింగ్ ఫోటోలు పెట్టి మరీ బెదిరింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఫోటోలు చూసి తన భర్త తట్టుకోలేక.. తనకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఏడ్చాడని వాపోయింది. తన భర్త చనిపోయిన విషయం చెప్పినా.. లోన్యాప్ నిర్వాహకుల నుంచి కాల్స్ రావడం ఆగలేదని, ఇప్పటికీ కాల్స్ వస్తూనే ఉన్నాయని పేర్కొంది.
తాజావార్తలు
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
-
Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
ట్రెండింగ్
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!