AP Crime: సగం ధరకే బంగారం అంటూ ఘరానా మోసం
- సగం ధరకే బంగారం అంటూ భారీ మోసం..
- రూ.12 లక్షలనగదుతో కేటుగాళ్ల పరారీ..
- పార్వతీపురం మన్యం జిల్లాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: బంగారం అంటే మనకు అసలే పిచ్చి.. భారీ డిమాండ్తో ఇప్పటికే తులం బంగారం ధర లక్ష దాటేసింది.. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర అవసరాలకు కొనేవారు కొంటూనే ఉన్నారు.. ఇదే అదునుగా భావించిన కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.. పార్వతీపురం మన్యం జిల్లాలో సగం ధరకే బంగారం అంటూ ఘరానా మోసం చేశారు. 12 లక్షల రూపాయల నగదుతో పరారయ్యారు కేటుగాళ్లు.. దీంతో, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రాంతానికి చెందిన బాధితురాలు శ్రీలక్ష్మి లబోదిమోమంటోంది..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Tomato Price Crash: భారీగా పతనమైన టమాటా ధర.. తీవ్ర నిరాశలో రైతన్నలు..
- Family Suicide: ఏం కష్టం వచ్చిందో.. కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురు మృతి, ఒకరికి సీరియస్..
- Woman Gave Birth on The Train Track: రైలు పట్టాలపైనే ప్రసవించిన మహిళ..
- Tourist Rush in Araku Valley: అరకు లోయకు పోటెత్తిన పర్యాటకులు.. హోటల్స్ అన్ని హౌస్ఫుల్
గత నెలలో శ్రీలక్ష్మిని సగంధరకే బంగారం ఇప్పిస్తానంటూ నమ్మించాడు రిషి అనే వ్యక్తి.. ఈ మేరకు పావు కిలో బంగారం కోసం రూ. 12 లక్షలకు ఒప్పందం కుదిరింది.. ఈ క్రమంలో 12 లక్షల రూపాయల నగదును సిద్ధం చేసింది శ్రీలక్ష్మి.. ఇక, సగం ధరకే బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంపై రిషి అనే వ్యక్తితో పాలకొండకు వెళ్లింది శ్రీలక్ష్మి. పాలకొండ నుంచి పార్వతిపురం వైపు బంగారం చూపిస్తామని తీసుకెళ్లారు కేటుగాళ్లు.. పార్వతీపురం పట్టణ శివారులో మాట్లాడుతున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తుతెలియని ఇద్దరు దుండగులు.. మహిళ ముఖంపై పౌడర్ జల్లి 12 లక్షల క్యాష్తో ఉడాయించారు.. దీంతో, పార్వతీపురం గ్రామీణ పోలీసులను సంప్రదించి జరిగిన మోసాన్ని వివరించారు బాధిత మహిళ శ్రీలక్ష్మి.. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిషి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు..
తాజావార్తలు
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!