ఉద్ధవ్ థాక్రే ‘యూటర్న్’ తీసుకోబోతున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇటీవల ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన యూటర్న్ తీసుకోబోతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం శివసేన పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు మరోసారి మారుతాయనే ప్రచారం జోరందుకుంది. ఇందుకు తగ్గట్టుగానే ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు శివసేన, బీజేపీ మిత్రపక్షంగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో శివసేనకు ఎక్కువ స్థానాలు వచ్చాయి. అయితే బీజేపీ మాత్రం తక్కువ సీట్లు వచ్చిన శివసేనకు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చేందుకు విముఖత చూపింది. దీంతో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే బీజేపీని కాదని కాంగ్రెస్, ఎన్సీపీ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి మహారాష్ట్ర సీఎంగా ఆయన మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఇదేక్రమంలోనే ఆయన ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ కూటమితో విసుగు చెందారనే వార్తలు విన్పిస్తున్నాయి.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
ఉద్దవ్ థాక్రే ఏం నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా ఎన్సీపీ నాయకుడు శరద్ పవర్ అనుమతి తప్పనిసరిగా మారింది. మరోవైపు కాంగ్రెస్ నాయకుల్లో వర్గపోరు ఆయనకు రుచించడం లేదట. దీంతో ఆయన ఈ కూటమితో ఎక్కువ కాలం కొనసాగితే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. ఈమేరకు ఆయన ఆలోచనల్లో మార్పు వచ్చిందనే టాక్ విన్పిస్తోంది. ఇటీవల సామ్నా పత్రికలో ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూ కథనాలు రావడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.
ఉద్దవ్ థాక్రే మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పడానికి ఈ కథనాలనే సంకేతమని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శివసేన క్యాడర్ నుంచి సైతం ఆ దిశగా ఆయనపై ఒత్తడి వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి బీజేపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ కూటమికి అవకాశం లేకుండా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్న పార్టీలు ఎప్పుడు కూడా స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ఆపార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది.
కర్ణాటకలోనూ జేడీఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ నేతల కుప్పిగంతుల కారణంగా అక్కడ సుస్థిర ప్రభుత్వం లేకుండా పోయింది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఇదే కొనసాగుతోంది. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీ రాజకీయాలకు విసిగిపోయిన ఉద్దవ్ థాక్రే తాజాగా బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరీ ఆయన బీజేపీతో వెళుతారా? లేదో వేచిచూడాల్సిందే..!
- Tags
- bjp
- Shiv Sena
- Uddhav Thackeray
తాజావార్తలు
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!