Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teacher Job Without TET Qualification in Kurnool: మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ కర్నూలు జిల్లాలో మరో సంచలన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అర్హత లేకుండానే ప్రభాకర్ అనే వ్యక్తి క్రీడా కోటాలో ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) ఉద్యోగం పొందినట్లు నిర్ధారణ అయింది. ఈ అంశంపై ఫిర్యాదులు అందడంతో.. కర్నూలు డీఈఓ సుధాకర్ విచారణ చేపట్టారు.
కౌతాళం మండలం వల్లూరు ఎలిమెంటరీ స్కూల్లో ఎస్జీటీగా పనిచేస్తున్న ప్రభాకర్ టెట్ అర్హత సాధించకుండానే ఉద్యోగం పొందినట్లు విచారణలో తేలింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో ఈ అంశాన్ని అధికారులు గుర్తించలేకపోయారు. ప్రస్తుతం ప్రభాకర్పై చర్యలు తీసుకోవాలని డీఈఓ సిఫార్సు చేశారు. ప్రభాకర్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసిన సమయంలో టెట్ పేపర్-2ఏలో 77 మార్కులతో అర్హత సాధించాడు. అయితే ఎస్జీటీ పోస్టుకు అవసరమైన పేపర్-1ఏలో అర్హత సాధించలేదని తెలుస్తోంది. అయినప్పటికీ స్పోర్ట్స్ కోటా కారణంగా తనకు ఉద్యోగం లభించిందని తాను భావించినట్లు డీఈఓ విచారణలో ప్రభాకర్ చెప్పినట్లు సమాచారం.
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
- Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
- Congress Disciplinary Action: కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
సర్టిఫికెట్ల పరిశీలన దశలోనే టెట్ అర్హతకు సంబంధించిన అంశం బయటపడాల్సి ఉన్నప్పటికీ.. ఆ సమయంలో గుర్తించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఎలాంటి లోపాలు జరిగాయి?, ధ్రువపత్రాల పరిశీలనలో బాధ్యత వహించిన అధికారుల పాత్ర ఏంటి? అనే అంశాలపై విద్యాశాఖ మరింత లోతుగా విచారణ చేయనుంది. మరోవైపు డీఎస్సీ నియామకాలకు సంబంధించి మరికొందరు అభ్యర్థులపైనా ఫిర్యాదులు అందినట్లు సమాచారం. వాటిపైనా అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఫిర్యాదును పరిశీలిస్తూ అర్హతలు, సర్టిఫికెట్లు, నియామక ప్రక్రియలో నిబంధనలు పాటించారా? లేదా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. టెట్ అర్హత, డీఎస్సీ నియామకాల్లో నిబంధనల అమలు విషయంలో వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కర్నూలు జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!