AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. 40కి పైగా అంశాలతో రూపొందించిన అజెండాపై కేబినెట్ చర్చించనుంది. ముఖ్యంగా రాజధాని అమరావతికి సంబంధించిన సీఆర్డీఏ ప్రతిపాదనలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి సుమారు రూ.596 కోట్లతో చేపట్టనున్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అదనంగా రూ.533 కోట్ల కేటాయింపుపై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.
రాజధాని గ్రామాల్లో రైతులకు కేటాయించిన ప్లాట్ల పరిధిలోని చిన్న రహదారుల్లో సీసీ రోడ్లకు బదులుగా బీటీ రోడ్లు నిర్మించేందుకు సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ పరిధికి అమరావతిలోని స్టోరేజ్ ట్యాంకుల నుంచి తాగునీరు సరఫరా చేసే ప్రతిపాదనపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. అమరావతిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు కోసం డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ రూపొందించే అంశంపై కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల్లో సుమారు 42 ఎకరాలను ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసే ప్రతిపాదనపైనా నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read
- Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
- Congress Disciplinary Action: కాంగ్రెస్లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
తాడికొండ, కంతేరు గ్రామాల పరిధిలో ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ కోసం అవసరమైన భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలో సమీకరించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అజెండా అంశాలపై చర్చ పూర్తయ్యాక తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన తాజా పరిస్థితులు, ఎన్నికల ప్రక్రియ వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రులకు సీఎం కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలు, నిర్ణయాలపై సరైన సమాచారం వెళ్లేలా మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించే అవకాశముంది. ఉద్యోగుల సమస్యలపై కూడా అజెండా అనంతరం ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల డిమాండ్లు, పరిపాలనా అంశాలు, వివిధ శాఖలకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై మంత్రులతో సీఎం సమీక్షించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
-
Romanchakam Overseas Review : రోమాంచకం ఓవర్సీస్ ప్రీమియర్ రివ్యూ
-
Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
-
Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్కు అమెరికా బ్రేక్!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని ధన లాభాలు!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!