పంజాబ్ లో సంక్షోభం ‘ఆప్’కి కలిసి రానుందా?
దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలో ఉంది. తొలి నుంచి సామాన్యుడి కష్టాలపై ఫోకస్ పెట్టిన కేజ్రీవాల్ ఢిల్లీవాసులను ఆకట్టుకోవడంలో విజయవంతం అయ్యారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలను ఢిల్లీ వీధుల్లో ‘చీపురు’తో ఊడ్చి పారేశారు. వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చి సత్తా ఎంటో నిరూపించారు. సామాన్యుడి పార్టీగా ఆమ్ ఆద్మీ గుర్తింపు తెచ్చుకోవడంతో ఆపార్టీకి దేశ రాజధానిలో తిరుగు లేకుండా పోతుంది. సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ తో దూసుకెళుతున్నారు.
కేజ్రీవాల్ కు తొలి నుంచి జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉంది. దీంతో ఆయన తన పార్టీని కేవలం ఢిల్లీకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. పంజాబ్ లోనూ ఆమ్ ఆద్మీకి మంచిపట్టు ఉంది. గతంలో ఇక్కడ మూడు ఎంపీ సీట్లతోపాటు 16 అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న చరిత్ర ఆమ్ ఆద్మీకి ఉంది. అయితే నేతల మధ్య విబేధాల కారణంగా ‘ఆప్’ అందరినీ చేజార్చుకోవాల్సి వచ్చింది.
Also Read
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
- love Or Attraction: లవ్లో పడిపోయారా..? అది ఆకర్షణ..? లేక ప్రేమేనా..?
- Valentine's Day: వాలెంటైన్ ఎవరు..? ప్రేమికుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది..?
ఇక 2017 ఎన్నికల్లో ఆప్ ఇక్కడ పోటీకి దూరంగా ఉంది. త్వరలోనే పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆప్ ఇక్కడ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు ఇప్పటికే పంజాబ్ లో ఒకటి రెండు సర్వేలను ఆపార్టీ నిర్వహించగా సానుకూల ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ తమ అభ్యర్థులను బరిలో దింపేందుకు ‘ఆప్’ రెడీ అవుతోంది. ఆప్ అధికారంలోకి వస్తే ప్రతీ కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించింది. దీనికి ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభం, బీజేపీలోని గందరగోళ పరిస్థితులు ‘ఆప్’కి కలిసి వస్తాయని భావిస్తున్నారు. అలాగే శిరోమణి అకాలీదళ్ రైతులకు వ్యతిరేకంగా కేంద్రం చేసిన చట్టాలను వ్యతిరేకిస్తూ బయటికి వచ్చినా ఎన్టీయేతో కొనసాగుతోంది. దీనిని ‘ఆప్’ టార్గెట్ చేసే అవకాశం కన్పిస్తుంది. రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేయడం వల్ల బీజేపీ ఇక్కడ ఆశలను వదులుకుంది. ఇక కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభం ఆపార్టీని రెండోసారి అధికారానికి దూరం చేసేలా కన్పిస్తున్నాయి.
ఇవన్నీ కూడా ఆ మూడు పార్టీలకు మైనస్ గా మారేలా కన్పిస్తున్నాయి. ‘ఆప్’ విషయానికొస్తే క్లీన్ ఇమేజ్ తో కన్పిస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను వ్యతిరేకించే వారంతా ‘ఆప్’ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించడంపైనే ‘ఆప్’ దృష్టిసారించింది. తద్వారా పంజాబ్లో అధికారంలోకి రావడమో లేదంటే రాజకీయ శక్తిగా ఎదగడమో చేయనుంది. మొత్తానికి పంజాబ్ లో రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాలు ‘ఆప్’కు కలిసి వచ్చేలా కన్పిస్తున్నాయి. మరీ కేజ్రీవాల్ ఇక్కడ లక్కీ ఛాన్స్ కొడుతారో లేదో వేచిచూడాల్సిందే..!
- Tags
- AAP
- Congress Party
- Punjab
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!