ఉప ఎన్నికకు ముందే రికార్డు క్రియేట్ చేసిన హుజురాబాద్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న ఏకైక నియోజకవర్గం హుజూరాబాద్. గడిచిన ఐదు నెలలుగా ఈ నియోజకవర్గంలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గెలుపు ఎవరి పక్షాన నిలుస్తుందనేది ఉత్కంఠత నెలకొంది. దేశంలో అత్యంత క్లాస్టీ ఉప ఎన్నిక హుజూరాబాద్ నిలుస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పలు రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా పారామిలిటరీ బలగాల విషయంలో హుజూరాబాద్ సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం ఆసక్తిని రేపుతోంది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో మోహరించిన బలగాలను పరిశీలిస్తే సాధారణ ఎన్నికలకు మించి పారామిలిటరీ బలగాలు దిగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్రలో ఇంత పెద్దమొత్తంలో పారా మిలిటరీ బలగాలు రావడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 13 నియోజకవర్గాలుండగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొత్తంగా 17 కంపెనీల పారామిలిటరీ బలగాలు మాత్రమే వచ్చాయి. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం ఏకంగా 20కంపెనీల బలగాలను ఈసీ పంపించడం విశేషం.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
జిల్లాలోని 13నియోజకవర్గాల ఎన్నికల నిర్వహాణ కోసం 17కంపెనీల బలగాలు గతంలో అవసరం పడగా ఇప్పుడు ఒక్క హుజూరాబాద్ కే అదనంగా మరో 3కంపెనీల బలగాలు రావడం గమనార్హం. జిల్లాలో నక్సల్స్ ప్రాబల్యం ఉన్న సమయంలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇంత పెద్దమొత్తంలో కేంద్ర బలగాలు రాలేదని పలువురు గుర్తుచేసుకుంటున్నారు. అయితే ఉప ఎన్నిక సజావుగా జరిగేందుకే ఈసీ 20కంపెనీల బలగాలను దింపినట్లు తెలుస్తోంది. ఇది ఒకరకంగా రికార్డే.
ఇదిలా ఉంటే హుజూరాబాద్ లో ప్రచారం చివరి దశకు చేరుకుంది. మరో రెండ్రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో ప్రధాన పార్టీల ముఖ్యనేతలంతా హుజూరాబాద్ లోనే తిష్టవేశారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా నేతలంతా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటుండటంతో నియోజకవర్గంలో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. పలుచోట్ల ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. వీటికి ఆదిలోనే బ్రేక్ వేయాలనే ఉద్దేశ్యంతోనే ఈసీ భారీసంఖ్యలో కేంద్ర బలగాలను హుజూరాబాద్ కు రప్పించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!