Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Analysis Group War Between Telangana Congress Party Leaders

కాంగ్రెస్ లో పెరుగుతున్న అసమ్మతి.. నేతలతో అధిష్టానం కీలక భేటి?

Published Date :September 25, 2021 , 11:40 am
By Lakshmi Narayana
కాంగ్రెస్ లో పెరుగుతున్న అసమ్మతి.. నేతలతో అధిష్టానం కీలక భేటి?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త ఛైర్మన్ ఎంపిక కోసం అధిష్టానం ఎంత సమయం తీసుకుందో అందరికీ తెల్సిందే. పార్టీలోని అందరూ సీనియర్ల మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఎట్టకేలకు టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. అయితే తొలి నుంచి రేవంత్ రెడ్డికి పార్టీలోని సీనియర్ల నుంచి సవాళ్లు ఎదురవుతూనే వస్తున్నాయి. వీటన్నింటిని రేవంత్ ఒక్కొక్కటిగా దాటుకుంటూ ముందుకు పోతున్నారు. అయితే రోజురోజుకు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లంతా గళం విప్పుతుండటంతో పార్టీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. దీంతో ఎప్పుడు, ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఆపార్టీ శ్రేణుల్లో నెలకొంది.

దూకుడు రాజకీయాలకు రేవంత్ రెడ్డి కేరాఫ్ గా నిలుస్తున్నారు. టీపీసీసీగా నియామకం అయ్యాక వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా బాగున్నప్పటికీ ఆయన పార్టీలోని సీనియర్లను కలుపుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నారు. పార్టీలో చర్చించకుండా రేవంత్ ఏకపక్షంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో చేసే కార్యక్రమాలకు సైతం సమాచారం ఇవ్వడం లేదంటూ రేవంత్ పై సీనియర్లు మూకుమ్మడి దాడి చేస్తున్నారు.

Also Read

  • Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
  • Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
  • love Or Attraction: లవ్‌లో పడిపోయారా..? అది ఆకర్షణ..? లేక ప్రేమేనా..?
  • Valentine's Day: వాలెంటైన్ ఎవరు..? ప్రేమికుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది..?
Add as a preferred
source on google

రేవంత్ రెడ్డి టీపీసీసీగా నియామకం అయ్యాక పార్టీలోని సీనియర్ల అందరితో వరుసగా భేటి అయ్యారు. అందరినీ కలుపుకుపోతానని ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఆయన తన వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నాడని సీనియర్లు ఆరోపిస్తున్నారు. దళిత, గిరిజన దండోరా కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమంటూ రేవంత్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంద్రవెల్లి సభకు సీతక్క అధ్యక్షత వహించడం.. రావిర్యాల సభను రేవంత్ టీం ముందుండి నడిపించడం.. మూడుచింతలపల్లి దీక్షలో సీనియర్లు తెరపై కన్పించే పరిస్థితి లేకపోవడం.. గజ్వేల్ సభలో రేవంత్ మాత్రమే ఫోకస్ అవడాన్ని ఆయన వ్యతిరేకవర్గం తట్టుకోలేకపోతుంది.

ఈ సభల సాక్షిగానే రేవంత్ సొంత నిర్ణయాలను ప్రకటించడాన్ని సీనియర్లు తప్పుబడుతున్నారు. అధికారిక ప్రతినిధుల పేర్లు సైతం పార్టీలో చర్చించకుండానే ప్రకటించడం రేవంత్ ఒంటెద్దు పోకడలకు నిదర్శనమని విమర్శిస్తున్నారు. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఎవరెవరు వస్తున్నారనే సమాచారం పార్టీలోని ముఖ్య నేతలకు ఇవ్వకపోవడం ఏంటనే ప్రశ్నిస్తున్నారు. రేవంత్ గతంలో చెప్పిన దానికి ప్రస్తుతం చేస్తున్న దానికి ఎలాంటి పొంతన లేదని మండిపడుతున్నారు. దీంతో పార్టీలో పరిస్థితి రేవంత్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా మారిపోయింది.

మరోవైపు రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్లు.. సీనియర్లు అంటూ పార్టీని ఏడేళ్లుగా ముంచుతున్నారనే భావన అధిష్టానంలో ఉంది. దీంతో సీనియర్లను కట్టడి చేసే ప్రయత్నం అధిష్టానం చేస్తోంది. రేవంత్ తో కలిసి నడవాల్సిందేనంటూ సూచిస్తుంది. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ రేవంత్ కు అండగా నిలుస్తున్నారు. కాగా రేవంత్ కు వ్యతిరేకంగా పార్టీలోని సీనియర్లంతా ఏకమవుతుండటం ఆసక్తిని రేపుతోంది. ఇలాంటి సమయంలోనే నేడు కీలకమైన పీఏసీ సమావేశం జరునుంది. ఈ భేటికి ఎవరెవరు వస్తారు? ఏమేమీ చర్చకు వస్తాయనేది ఉత్కంఠతను రేపుతోంది. దీంతో ఈ సమావేశంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress Party
  • revanth reddy
  • telangana

తాజావార్తలు

  • Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..

  • Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..

  • Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల

  • Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్‌నెస్ లేని బస్సులు!

  • Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions