Congress Reshuffle: ఏఐసీసీ ప్రక్షాళనకు టైమొచ్చిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో అత్యంత వృద్ధ పార్టీలో సంస్థాగత మార్పులకు సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారా? అందుకు ముహూర్తం కూడా ఖరారైందా? అంటే 10 జన్ పథ్ నుంచి అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఏఐసీసీ ప్రక్షాళనకు వేళయిందంటున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీకి కొత్తరూపు ఇవ్వనున్నారు సోనియా గాంధీ. ఏఐసీసీ, పీసీసీ పదవులపై సోనియా గాంధీ సమీక్ష నిర్వహించారు.
పలు అంశాల పై పరస్పర అంగీకారం, అవగాహనకు వచ్చారు సోనియా గాంధీ, గులామ్ నబీ ఆజాద్. “అసంతృప్తి నేతల”కు నాయకత్వం వహించిన గులామ్ నబీ ఆజాద్ తో జరిపిన చర్చల్లో పలు నియామకాలను చేసేందుకు సోనియా గాంధీ సమ్మితించినట్లు నమాచారం అందుతోంది. గులామ్ నబీ ఆజాద్ కు కీలకమైన కర్నాటక రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న కర్నాటకలో పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసే బాధ్యతలు తీసుకోవాలని ఆజాద్ ను సోనియా గాంధీ కోరినట్లు సమాచారం. వచ్చే ఏడాది మే నెలలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, 6 నెలల ముందే ఈ ఏడాది చివరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఆజాద్ కు కర్నాటక నుంచి రాజ్యసభ కు ప్రాతినిధ్యం వహించేలా సోనియా గాంధీ నిర్ణయం. అలాగే, మరో అసమ్మతి నేత ఆనంద శర్మ ను కూడా రాజ్యసభ కు పంపాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరో అసమ్మతి నేత, ప్రస్తుతం లోకసభ సభ్యుడు గా ఉన్న మనీష్ తివారి కి ఏఐసిసి లో సముచిత బాధ్యతలు అప్పగించేందుకు సోనియా గాంధీ సుముఖత వ్యక్తం చేశారు. కొత్తగా అసమ్మతి నేతల బృందంలో చేరిన భూపేందర్ సింగ్ హుడా కు హర్యానా పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం అందుతోంది.
హర్యానా ప్రస్తుత పీసీసీ అధ్యక్షురాలు షెల్జా కుమారిపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు భూపేందర్ సింగ్ హుడా. గాంధీ కుటుంబం పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సుప్రీంకోర్టు. న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పై ఆగ్రహంతో ఉన్నారు సోనియా గాంధీ. కపిల్ సిబల్ కు పార్టీలో బాధ్యతలు అప్పగించే అంశంపై ఏలాంటి నిర్ణయం తీసుకోని సోనియా గాంధీ. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఇరువురు నేతలు. కాంగ్రెస్ అసమ్మతి నేతల (G23 Leaders)
అభిప్రాయాలను, మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటానని ఆజాద్ కు సోనియా గాంధీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Awarapan 2: ‘అవారపన్ 2’ బాక్సాఫీస్ దుమ్మురేపింది.. తొలి రోజే ‘బట్వారా1947’ను మూడింతలు దాటేసిన ఇమ్రాన్ హష్మీ
-
Amrit Bharat Express: 7 కొత్త అమృత్ భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు కీలక కనెక్టివిటీ
-
Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
PM Modi’s Saptdhara Vision: వికసిత్ భారత్ కోసం ‘సప్తధార’.. మోడీ చెప్పిన 7 కీలక శక్తులివే..
ట్రెండింగ్
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!