Congress Reshuffle: ఏఐసీసీ ప్రక్షాళనకు టైమొచ్చిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో అత్యంత వృద్ధ పార్టీలో సంస్థాగత మార్పులకు సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారా? అందుకు ముహూర్తం కూడా ఖరారైందా? అంటే 10 జన్ పథ్ నుంచి అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఏఐసీసీ ప్రక్షాళనకు వేళయిందంటున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీకి కొత్తరూపు ఇవ్వనున్నారు సోనియా గాంధీ. ఏఐసీసీ, పీసీసీ పదవులపై సోనియా గాంధీ సమీక్ష నిర్వహించారు.
పలు అంశాల పై పరస్పర అంగీకారం, అవగాహనకు వచ్చారు సోనియా గాంధీ, గులామ్ నబీ ఆజాద్. “అసంతృప్తి నేతల”కు నాయకత్వం వహించిన గులామ్ నబీ ఆజాద్ తో జరిపిన చర్చల్లో పలు నియామకాలను చేసేందుకు సోనియా గాంధీ సమ్మితించినట్లు నమాచారం అందుతోంది. గులామ్ నబీ ఆజాద్ కు కీలకమైన కర్నాటక రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న కర్నాటకలో పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసే బాధ్యతలు తీసుకోవాలని ఆజాద్ ను సోనియా గాంధీ కోరినట్లు సమాచారం. వచ్చే ఏడాది మే నెలలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, 6 నెలల ముందే ఈ ఏడాది చివరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఆజాద్ కు కర్నాటక నుంచి రాజ్యసభ కు ప్రాతినిధ్యం వహించేలా సోనియా గాంధీ నిర్ణయం. అలాగే, మరో అసమ్మతి నేత ఆనంద శర్మ ను కూడా రాజ్యసభ కు పంపాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరో అసమ్మతి నేత, ప్రస్తుతం లోకసభ సభ్యుడు గా ఉన్న మనీష్ తివారి కి ఏఐసిసి లో సముచిత బాధ్యతలు అప్పగించేందుకు సోనియా గాంధీ సుముఖత వ్యక్తం చేశారు. కొత్తగా అసమ్మతి నేతల బృందంలో చేరిన భూపేందర్ సింగ్ హుడా కు హర్యానా పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం అందుతోంది.
హర్యానా ప్రస్తుత పీసీసీ అధ్యక్షురాలు షెల్జా కుమారిపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు భూపేందర్ సింగ్ హుడా. గాంధీ కుటుంబం పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సుప్రీంకోర్టు. న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పై ఆగ్రహంతో ఉన్నారు సోనియా గాంధీ. కపిల్ సిబల్ కు పార్టీలో బాధ్యతలు అప్పగించే అంశంపై ఏలాంటి నిర్ణయం తీసుకోని సోనియా గాంధీ. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఇరువురు నేతలు. కాంగ్రెస్ అసమ్మతి నేతల (G23 Leaders)
అభిప్రాయాలను, మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటానని ఆజాద్ కు సోనియా గాంధీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Salman Khan: ట్రోల్స్కు సిక్స్ప్యాక్తో సమాధానం.. 60 ఏళ్లకూ సల్మాన్ స్టామినా ఇదే!
-
Mohan Bhagwat: “నేటి తరం దారి తప్పలేదు”.. సీజేపీ నిరసనల వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
-
Samsung Galaxy F70 Pro: సామ్ సంగ్ గెలాక్సీ F70 ప్రో.. 6000mAh బ్యాటరీ, Snapdragon 6 Gen 3 చిప్సెట్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా?.. కేంద్రానికి CJP డెడ్లైన్.. ఢిల్లీలో హై అలర్ట్!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!