సజ్జ పంటను కూడా మనం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.. సజ్జను గింజల కోసం మాత్రమే కాదు.. పశువులకు మేతగా కూడా వేస్తున్నారు..ఈ పంట అన్నీ ఉష్ణోగ్రతలను తట్టుకోనేపంట, అంతేకాదు తక్కువ ఖర్చులో పండించవచ్చు.. సజ్జ పంట వర్షాధార ప్రాంతాలలో, ఉష్ణ ప్రదేశాలలో భూసారం తక్కువగా ఉన్న భూముల్లో, నీటి నిల్వ శక్తిని తక్కువగా కలిగి ఉన్న భూముల్లో కూడా సాగు చేయటానికి అనుకూలంగా ఉంటుంది.. ఆహార దాన్యపు పంటగా ఎక్కువగా పండిస్తున్నారు..
సజ్జ మొక్కకి భూమిలో ఉన్న క్షార గుణాలను కూడా తట్టుకొనే శక్తి కలిగి ఉండటం వల్ల అన్ని భూముల్లో ఈ పంటను సాగు చేపట్టవచ్చు. పంట వేసే ముందుగా భూమిలో ఇతర పంటల అవశేషాలను తప్పనిసరిగా తొలంగించాలి… లోతుగా దుక్కి దున్నాలి లేకుంటే మాత్రం శీలింద్రాలు ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది.. సజ్జను ఖరీఫ్ పంటగా పండిస్తారు.. ఈ పంటను వెయ్యడానికి అనుకూలమైన సమయం జూన్, జూలై మాసాల్లో, రబీ కాలం పంటగా అక్టోబర్, నవంబర్లో, వేసవి పంటగా అయితే జనవరిలో విత్తుకోవాలి..
ఈ సజ్జను విత్తడానికి వారం రోజులు ముందే మొలకలు బాగా వచ్చాయో లేదో చూసి మాత్రమే విత్తుకోవాలి..ఒక హెక్టారుకు 4 కిలోల విత్తనం సరిపోతుంది. అంటే ఎకరాకు 1.6 కిలోలు విత్తనం సరిపోతుంది.. విత్తనాలను పొలంలో నాటే ముందు ఒక 10 నిమిషాలు ఉప్పు ద్రావణంలో ముంచి తర్వాత నాటడం బెస్ట్ అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.. ఆరిన తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ను లేదా అప్రాన్ 35 ఎస్.డి. మందు తో విత్తన శుద్ధి చెయ్యడం వల్ల తెగుళ్ల సమస్యలు రావు.. ఈ పంట గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..