Jasmine Pruning: మల్లెలో కొమ్మ కత్తిరింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనదేశంలో ఎక్కువగా పండిస్తున్న పూలల్లో మల్లె పూలు కూడా ఒకటి.. వీటికి ఎప్పటికి డిమాండ్ తగ్గదు.. అందుకే రైతులు మల్లెపూలను పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.వాణిజ్య సరళిలో చేపట్టే ఈ మల్లె తోటల సాగులో సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. మల్లెలో సాధారణంగా విడిమల్లె, దొంతమల్లె, గుండుమల్లె, బొడ్డుమల్లె అనే రకాలను రైతులు సాగు చేస్తున్నారు. మల్లెను కొమ్మ కత్తిరింపుల ద్వారా గానీ , అంటు మొక్కలు తొక్కటం ద్వారాగానీ ప్రవర్ధనం చేయవచ్చు. మల్లెలకు వచ్చే సువాసనలు ఏపువ్వులకు రావు. దాని అందం కూడా వేరు…
ఈ మల్లెల్లో మూడు రకాలు ఉన్నాయి.. గుండు మల్లెలు., జాజిమల్లెలు, కాగాడా మల్లెలు.. సాధారణంగా మల్లి నాటిన మూడో సంవత్సరం నుండి వ్యాపార సరళిలో దిగుబడి ప్రారంభమై 12-15 సంవత్సరాల వరకు దిగుబడినిస్తోంది జనవరి నెల నుంచి మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి తోపాటు పూల నాణ్యత బాగుంటుంది.. కొమ్మ కత్తిరింపుల్లో జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడిని పొందవచ్చు.. కత్తిరింపు తర్వాత పది రోజులకు నీటిని ఇవ్వాలి.. నేల స్వభావాన్ని బట్టి ఐదు-ఆరు రోజులకు ఒకసారి పూలు కోసే సమయంలో నీరు పారించాలి. కత్తిరింపులు పూర్తి అయినా తరువాత మొదటి తవ్వకం చేసిన వారం రోజులు తర్వాత ఒక్కొక్క చెట్టుకు 10కిలోల పశువుల ఎరువు 500 గ్రాములు వేప పిండి లేదా ఆముదపు పిండి, 200 గ్రాములు అమ్మోనియం సల్ఫేట్, 200 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్పెట్, 75 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పోటాష్ ను చెట్టు చుట్టూ చిన్న గాడి తీసి అందులో వేసి మట్టితో కప్పించి నీరు పారించాలి..
Also Read
- Harasses Woman: యువతిని బస్సులో లైంగికంగా వేధించిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో
- Non Poisonous Snakes: ఇవి పేరుకు మాత్రమే పాములు.. కాటు వేసినా ఏమీకాదు! పంట దిగుబడికి హెల్ప్
- Best Buffalo Breed: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. రోజుకు 25 లీటర్లు ఇచ్చే ఈ గేదెలను కొనండి!
- Potato Farming : కొత్త టెక్నాలజీ.. భూమిలో కాకుండా గాల్లో ఆలుగడ్డ పండిస్తున్న వైనం
మల్లె మొగ్గల్ని ఉదయం 11 గంటలలోపు కోసి మార్కెట్ కు చేరేలా చెయ్యాలి.. ఇక దూరప్రాంతాల కొరకు వెద్దరు బుట్టలను కార్డ్ బోర్డ్ పెట్టెలను వాడవచ్చు. తాజాదనం కోసం పూసిన మొగ్గలు ఎక్కువ కాలం నిలువ ఉండి తాజా సుహాసనలు రెండు మూడు రోజులు వెదజల్లుతుండాలంటే లీటర్ నీట్ గా 10 గ్రాముల సుక్రోస్ లేదా 50 గ్రాముల బోరిక్ యాసిడ్ లేదా ఒక గ్రా అల్యూమినియం సల్పెట్ కలిపిన ద్రావణం లో పది నిమిషాల నుంచి ఆరబెట్టి తర్వాత ప్యాకింగ్ చేయాలి.. అలా చేస్తే ఫ్రెష్ గా, మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి.. మల్లెలు ఎంత ఫ్రెష్గా ఉంటే మార్కెట్ లో అంత డిమాండ్ ఉంటుంది..
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!