Baby letter to PM Modi: మోడీజీ.. మీ వల్లే మా అమ్మ నన్ను కొట్టింది. ఒకటో తరగతి చిన్నారి లేఖ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral News: నిత్యావసరాల ధరల పెరుగుదల వల్ల పరోక్షంగా తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ ఒకటో తరగతి విద్యార్థిని ఏకంగా ప్రధానమంత్రి మోడీకి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లా ఛిబ్రమౌ పట్టణానికి చెందిన ఆరేళ్ల చిన్నారి కృతి దూబే ఈ లెటర్ని హిందీలో రాసింది. ‘ప్రధానమంత్రి’కి అంటూ ప్రారంభించింది. ‘నా పేరు కృతి దూబే. ఒకటో తరగతి చదువుతున్నాను. మోడీజీ.. మీ వల్లే దేశంలో సరుకుల రేట్లు నింగినంటుతున్నాయి. చివరికి నా పెన్సిల్, రబ్బర్ (ఎరేజర్) కూడా ఖరీదయ్యాయి. నేను ఎంతో ఇష్టంగా తినే మ్యాగీ సైతం ప్రియమైంది.
అందువల్ల నాకు పదే పదే పెన్సిళ్లు కొనివ్వటం మా అమ్మకు కష్టమైపోతోంది. పెన్సిల్ కావాలని అడిగితే చాలు కోప్పడుతోంది. కొడుతోంది. నేనేం చేయాలో అర్థంకావట్లేదు. నా పెన్సిల్నేమో తోటి విద్యార్థులు కొట్టేశారు’ అని లేఖను ముగించి పోస్ట్ చేసింది. కృతి దూబే రాసిన ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారటంపై ఆమె తండ్రి విశాల్ దూబే స్పందించారు. అది తన కూతురి ‘మన్ కీ బాత్’ అంటూ చమత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెలా ఆఖరి ఆదివారం ఆలిండియా రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి ‘మనసులో మాట’ (మన్ కీ బాత్) చెబుతుంటారు కదా. దాన్ని విశాల్ పరోక్షంగా ప్రస్తావించారు.
Also Read
- Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
- Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
- Paraglider: మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే.. పారాచూట్ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం.. చూస్తే ఊపిరి ఆడదు (వీడియో)
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో కొత్త చరిత్ర
ఆయన న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కూతురు ఇటీవల పెన్సిల్ పోగొట్టుకోవటంతో తల్లి ఆగ్రహంతో కొట్టిన మాట వాస్తవమేనని చెప్పారు. దీంతో బిడ్డ తీవ్రంగా నొచ్చుకుందని, అందుకే తన బాధను ఈ ఉత్తరం రూపంలో వెల్లడించిందని తెలిపారు. ఈ విషయమై ఛిబ్రమౌ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) అశోక్ కుమార్ కూడా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చిన్నారి లెటర్ రాసిన సంగతి తనకు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారానే తెలిసిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను వ్యక్తిగతంగా ఆ విద్యార్థినికి సాయం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఆ అమ్మాయి రాసిన లెటర్ సంబంధిత అధికారులకు చేరేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తానని కూడా ఆయన అన్నారు. అయితే ఈ లెటర్పై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాగీపై వసూలు చేస్తున్న జీఎస్టీ నామమాత్రమే (5 శాతమే) అని, సగటు జీఎస్టీ 18 శాతమని ఓ వ్యక్తి చెప్పాడు. పెన్సిల్పై వేస్తున్న జీఎస్టీ 12 శాతమని, ఇది గతంలోనూ ఉన్న సేల్స్ ట్యాక్సే తప్ప కొత్తగా తెర మీదికి వచ్చింది కాదని స్పష్టం చేశాడు. ఇక, తల్లి బిడ్డను కొట్టిందనేది కట్టుకథేనని, అది పెయిడ్ ఏజెంట్ల కల్పనా చాతుర్యమని ఎద్దేవా చేశాడు.
తాజావార్తలు
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
-
Xiaomi TV FX Mini LED Series: షియోమి TV FX Mini LED సిరీస్ విడుదల.. Dolby Vision, Fire TV, 4K డిస్ప్లే
-
Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!