Traffic Challan: బైక్ లేదు.. కార్ డ్రైవ్ చేయలేదు.. అయినా ట్రాఫిక్ చలాన్.. ఇదేక్కడి విడ్డూరం సార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వెహికిల్స్ కు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, బైక్ మీద వెళ్లేవారు అయితే హెల్మెట్, కారులో వెళ్లేవారు అయితే సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలనే రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే రోడ్డు మీద ఏ ట్రాఫిక్ పోలీస్ మన వాహనాన్ని ఆపినా.. సంబంధిత పత్రాలు చూపించి రయ్ మని వెళ్లొచ్చు. ఇక ఇందులో ఏ ఒక్కటీ లేకపోయినా ట్రాఫిక్ పోలీసులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నోయిడాలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు బైక్ లేకపోయినా.. కారు నడపకూండనే ట్రాఫిక్ పోలీసులు చలానా వేశారు. అది చూసి ఆమె ఖంగుతిన్నారు. ఇదేం విచిత్రమని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: Internet Apocalypse: రెండేళ్లలో “సోలార్ మాగ్జిమమ్”కి సూర్యుడు.. ఇంటర్నెట్ వ్యవస్థ ధ్వంసం అవుతుందా..?
Also Read
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!
గ్రేటర్ నోయిడాలోని హోషియార్ పూర్ పరిధిలో నివసించే శైలజా చౌదరీ అనే మహిళకు గత శుక్రవారం ఒక ఈ- చలాన్ వచ్చింది. ఆమెకు జూన్ 27 వ తేదీన గౌతమ్ బుద్ధ నగర్ ట్రాఫిక్ పోలీసులు రూ.1000 చలానా వేసినట్లు.. తన బైక్ కి రూ. 1000 జరిమానా విధించారు.. కానీ.. తన పేరు మీద అసలు ఎలాంటి బైక్ రిజిస్టర్ అయి లేదని శైలజా చౌదరీ తెలిపారు. తనకు కారు మాత్రమే ఉందని.. ఆ రోజు కారులో హోషియార్ పూర్ ప్రాంతంలో ప్రయాణించ లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. అసలు తనకు బైకే లేకుండా.. కారులో ప్రయాణించకుండా ఎలా చలానా వేస్తారని ట్రాఫిక్ పోలీసులను ఆమె ప్రశ్నించింది.
Read Also: CM YS Jagan: కేబినెట్ భేటీలో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎన్నికలకు సిద్ధంకండి..
తన పేరు మీద కేవలం హ్యూందాయ్ ఐ20 కారు మాత్రమే ఉందని.. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ చలాన్ వేశారని శైలజా చౌదరీ ఆరోపించారు. వెంటనే దాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనపై ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రీతీ యాదవ్ రియాక్ట్ అయ్యారు. ట్రాఫిక్ చలానాలు వేసేందుకు తాము ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉపయోగిస్తామన్నారు.. దీని ద్వారా ఆటోమెటిక్గా వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తిస్తుందన్నారు. అలాంటి సమయంలో చిన్న చిన్న పొరపాటుల వల్ల వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ తప్పుగా డిటెక్ట్ చేస్తుందని డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. తప్పుగా ఉన్న చలానాలను తొలగిస్తామని ఆమె చెప్పారు.
తాజావార్తలు
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
-
Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
-
US LPG Supplier to India: భారత్కు 67% LPG అమెరికా నుంచే.. అతిపెద్ద సరఫరాదారుగా యూఎస్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!