Viral Video: మహిళా ప్రిన్సిపాల్ చెంప పగలగొట్టిన విద్యార్థి.. వీడియో వైరల్
- మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో స్కూల్ ఫీజుల విషయమై గొడవ
- విద్యార్థిని కొట్టిన టీచర్లు
- ప్రిన్సిపాల్ చెంపపగల గొట్టిన విద్యార్థి
- సీసీటీవీ కెమెరాలో రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో స్కూల్ ఫీజుల విషయమై విద్యార్థి, ప్రిన్సిపాల్ మధ్య జరిగింది. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థి తన టీసీ, ధ్రువపత్రాలు తీసుకునేందుకు స్కూల్ కి వెళ్లాడు. అయితే ఫీజు విషయంలో ప్రిన్సిపాల్ మేడమ్, విద్యార్థి మధ్య వాగ్వాదం జరిగింది. మొత్తం ఫీజు చెల్లిస్తేనే మార్కు పత్రం ఇస్తామని ప్రిన్సిపాల్ తేల్చిచెప్పారు. దీంతో విద్యార్థి, ప్రధానోపాధ్యాయురాలి మధ్య గొడవ కాస్త పెరిగింది. ఈ తరుణంలో ఆ ఉపాధ్యాయులరాలు విద్యార్థిని కొట్టింది. కోపోద్రిక్తుడైన విద్యార్థి ఆమెను చెంపదెబ్బ కొట్టాడు.
READ MORE: Satyabhama: వరంగల్లో స్టార్ మా ‘సత్యభామ’ టీం వరలక్ష్మీ వ్రతం వేడుకలు
Also Read
- Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
- Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
- Paraglider: మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే.. పారాచూట్ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం.. చూస్తే ఊపిరి ఆడదు (వీడియో)
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
ఈ ఘటన మొత్తం స్కూల్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థిపై ప్రిన్సిపాల్ కేసు నమోదు చేయగా.. విద్యార్థి కూడా స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇరువురిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం ఈ విషయం నగరంలోని హజీరా పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచ్ మిల్లో ఉన్న సీబీఎస్ అనే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినది. ప్రిన్సిపాల్ పై చేయి చేసుకున్న దళిత విద్యార్థి ధ్రువ్ ఆర్యను ప్రిన్సిపాల్తో సహా ముగ్గురు ఉపాధ్యాయులు తీవ్రంగా కొట్టారు. ప్రిన్సిపాల్ నిషా సెంగార్, వైస్ ప్రిన్సిపాల్ రాకేష్ సింగ్, రజనీ అనే టీచర్లు విద్యార్థిని కొట్టారు.
READ MORE:Andhra Pradesh: భారత్ నెట్ ప్రాజెక్టు కోసం కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు
విద్యార్థి ఫీజు కట్టలేదని అందుకే టీసీ ఇవ్వలేమని ప్రిన్సిపాల్ చెబుతున్నారు. కాగా పూర్తి ఫీజులు జమ చేశానని విద్యార్థి చెబుతున్నాడు. దళిత కులానికి చెందిన వాడని పాఠశాల ఉపాధ్యాయులు అప్పుడప్పుడూ దూషిస్తూనే ఉన్నారని విద్యార్థి ఆరోపించాడు. హజీరా పోలీసులు విద్యార్థిని ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్ నిషా సెంగార్, రజనీ, రాకేష్ సింగ్లపై కేసు నమోదు చేశారు. ఈ విద్యార్థిపై కూడా బెదిరింపు ఆరోపణలపై కేసు నమోదు చేశారు.
विवाद का ये वीडियो ग्वालियर के एक निजी स्कूल का है, जहां स्कूल फीस जमा न कराने पर प्रिंसिपल ने छात्र से मारपीट की, छात्र ने भी प्रिसिंपल को थप्पड़ जड़ दिया, बीच बचाव करने आए दो अन्य शिक्षिकों ने छात्र से मारपीट की। दोनों पक्षों पर क्रॉस मामला दर्ज हुआ है…#gwalior #MPNews pic.twitter.com/kEuSI1Vymr
— Punjab Kesari-MadhyaPradesh/Chhattisgarh (@punjabkesarimp) August 24, 2024
తాజావార్తలు
-
India On Nepal: నేపాల్ ప్రధానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఎందుకంటే..
-
CBSE OSM Controversy: OSM వ్యవహారంపై కేంద్రం సీరియస్.. CBSE ఉన్నతాధికారులపై వేటు
-
Peddi: ‘పెద్ది’ సినిమాకి అసలు ట్రైలరే అక్కర్లేదు.. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు: బుచ్చిబాబు సంచలనం
-
India-Venezuela: భారత్కు వెనిజులా అధ్యక్షురాలు.. ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టి
-
Mango Salad Recipe: చల్లదనాన్ని అందించే తీపి-పులుపు రుచుల మామిడి సలాడ్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి!
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!