Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
- మార్కులు తక్కువని తిట్టలేదు..
- కేక్ కోసి పండగ చేశారు
- వైరల్ అవుతున్న ‘55 శాతం’ మార్క్షీట్ సెలబ్రేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marksheet Cake: ముంబైకి చెందిన ఒక కుటుంబం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. సాధారణ కుటుంబం లాగా కాకుండా ఈ ఫ్యామిలీ భిన్నంగా ప్రవర్తించి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిజానికి విద్యా వ్యవస్థలోని ఒత్తిడికి, మార్కుల వేటకు భిన్నంగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ కుమారుడికి పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని బాధపడకుండా, ఆ అబ్బాయి సాధించిన విజయాన్ని ఆ కుటుంబం ఘనంగా వేడుక చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
మార్క్షీట్ కేక్తో సర్ప్రైజ్..
ముంబైకి చెందిన మహమ్మద్ జైద్ ఇటీవల నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో 55 శాతం మార్కులు సాధించాడు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు కోప్పడటం లేదా మిగతా వాళ్లతో పోల్చి తిట్టడం లాంటివి చూస్తుంటాం. కానీ జైద్ కుటుంబం మాత్రం అతని మార్క్షీట్నే ఒక కేక్గా తయారు చేయించి సర్ప్రైజ్ ఇచ్చింది. ఆ కేక్పై జైద్ పేరు, రూల్ నంబర్, అతను ప్రతి సబ్జెక్టులో సాధించిన మార్కులను కూడా ముద్రించారు. జైద్ ఇంటికి రాగానే కుటుంబ సభ్యులందరూ చప్పట్లు కొడుతూ, కేరింతలు కొడుతూ అతనికి ఘనస్వాగతం పలికారు. తన మార్క్షీట్ థీమ్ కేక్ను చూసి ఆశ్చర్యపోయిన జైద్, చిరునవ్వుతో దానిని కట్ చేశాడు. ఈ సంబరాలకు సంబంధించిన వీడియోను జైద్ సోదరి రుక్సర్ పటేల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Job Interview Tips: సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్నే కొంపముంచిందా..? భారతీయుడి అనుభవం వైరల్
- Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
- Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
గొప్ప మనసు చాటుకున్న తల్లిదండ్రులు
ఈ వేడుకపై రుక్సర్ పటేల్ స్పందిస్తూ.. హృదయానికి హత్తుకునే మాటలు చెప్పారు. “నా దృష్టిలో మా తమ్ముడికి వచ్చిన 55 మార్కులు.. 95 మార్కుల కంటే ఎక్కువే. మార్కుల కోసం పిల్లలను తిట్టడం లేదా బాధపెట్టడం వల్ల వారు మానసికంగా కుంగిపోతారు. వాడు ఎప్పుడూ ఇతరుల కంటే తక్కువ అని భావించకూడదనే మేము ఇలా సెలబ్రేట్ చేశాం. ఒత్తిడి వల్ల పిల్లలను కోల్పోతున్న తల్లిదండ్రులను చూస్తుంటే బాధేస్తుంది, అందుకే మా ఇంట్లో సంతోషానికి ప్రాధాన్యత ఇచ్చాం” అని ఆమె రాసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “నేను 95 శాతం మార్కులు సాధించినా నాకు ఇలాంటి గౌరవం లభించలేదు.. ఈ కుటుంబం నిజంగా గ్రేట్” అని ఒకరు కామెంట్ చేయగా, “ప్రతి తల్లిదండ్రులు ఇలాగే ఉండాలి. పిల్లల మానసిక ఆరోగ్యం మార్కుల కంటే ముఖ్యం” అని మరొకరు రాసుకొచ్చారు. మార్కుల కంటే మనిషి ముఖ్యమని నిరూపించిన ఈ కుటుంబం, ఎంతో మంది తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలిచింది.
తాజావార్తలు
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
-
S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!