Sammakka Sarakka: ఈ నెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు సమ్మక్క, సారలమ్మ పూజారులు తెలిపారు. ఆదివారం అమ్మవార్ల గద్దెల ఆవరణలో అర్చకులు, భాగస్వామ్య వర్గాల సమావేశం నిర్వహించారు. వరంగల్లోని మేడారం సమ్మక్క, సారలమ్మ కార్యాలయాలను ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారని భద్రకాళి దేవస్థానం అర్చకులు ఆరోపించారు. 1972లో అప్పటి మంత్రి పోరిక జగన్నాయక్ వరంగల్లో మేడారం జాతర కార్యాలయానికి స్థలం…
Medaram Jatara: మేడారం మహాజాతరకు అంకురార్పణ సమర్పించిన తర్వాత మండమెలిగే ఉత్సవాలను నిర్వహించారు. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం నుంచి ఫిబ్రవరి 24వ తేదీ శనివారం వరకు మేడారం మహాజాతర జరిగింది.
మేడారం మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకల గుట్టనుంచి కుంకుమ భరణి రూపంలో బయల్దేరి వచ్చిన సమ్మక్క.. గద్దెకు చేరుకుంది. సమ్మక్కను ప్రధాన పూజారి ప్రతిష్టించారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించే సమయంలో లైట్లు నిలిపివేశారు. మరోవైపు.. అమ్మవారిని గద్దెపై ప్రతిష్టించే సమయంలో భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించడంతో భారీ ఎత్తున భక్తులు జై సమ్మక్క తల్లి-జై సారక్క తల్లి అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే.. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు…
Minister Seetakka: సీతక్క - కొండా సురేఖ ఇద్దరు మహిళా మంత్రులు వరంగల్ జిల్లాలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ బాధ్యతను తమ భుజస్కందాలపై వేసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ గిరిజన ఆలయంగా వెలుగొందుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం నీట మునిగింది. గ్రామంలోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. గోవిందరావు పేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో ఉన్న 163వ నెంబర్ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో కోతకు గురైంది. దీంతో తాడ్వాయి, ఏటూరు నాగారం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
తెలంగాణాకే తలమానికమైన మేడారం జాతర తుదిదశకు చేరుకుంది. ఈ నెల 16న ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన తెలంగాణ కుంభమేళ వైభవోపేతంగా జరుగుతోంది. సమ్మక-సారక్క జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ భక్తులు విచ్చేశారు. అమ్మవార్లకు బంగారాన్ని (బెల్లం) సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. సమ్మక్క-సారక్క అమ్మవార్లను రాజకీయ ప్రముఖలు కూడా ఇప్పటికే దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ నేపథ్యలో నేడు తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా అమ్మవార్లను దర్శించుకోనున్నారు.…
ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం మహాజాతర జరుగుతుంది. ఈ జాతర కోసం లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వ తేదీ వరకు జాతర జరగబోతున్నది. చరిత్ర ప్రకారం కాకతీయ సైన్యానికి, పగిడిగిద్దరాజు సైన్యానికి మధ్య లక్నవరం వద్ద యుద్దం జరుగుతుంది. ఈ యుద్దంలో పగిడిగిద్దరాజుతో పాటు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు పాల్గొంటారు. ఈ యుద్ధంలో పోరాడి మేడారం సమీపంలోని సంపెంగ వాగు వద్ద వీరమరణం పోందారు.…