Today (13-02-23) Stock Market Roundup: రూ.46,045 కోట్ల అదానీ క్యాష్.. మొదటి గంటలోనే మటాష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (13-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్కి ఈ వారం శుభారంభం లభించలేదు. గ్లోబల్ మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు అందటంతో రెండు కీలక సూచీలు కూడా ఇవాళ సోమవారం ఉదయం ఫ్లాట్గానే ప్రారంభమై కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇండియా మరియు అమెరికాలో కీలకమైన ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు ముందుజాగ్రత్త పాటించారు.
అయితే.. సాయంత్రం మార్కెట్ ముగిసే ముందు జరిగిన కొన్ని డీల్స్ వల్ల కొన్ని నష్టాలనైనా పూడ్చుకోగలిగాయి. మేజర్ ఇంజనీరింగ్ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో వంటి కొన్ని కంపెనీల స్టాక్స్ కొనుగోళ్లు తాజాగా జరగటంతో ఈ మాత్రమైనా కోలుకోగలిగాయి. అయితే.. మార్కెట్ ప్రారంభమైన మొదటి గంటలోనే అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా మునిగాయి. దీంతో గ్రూపులోని మొత్తం 9 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైంది.
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
Tech Layoffs to Continue: మరికొన్నాళ్లపాటు కొనసాగనున్న టెక్ లేఆఫ్లు
చివరికి.. సెన్సెక్స్ 250 పాయింట్లు కోల్పోయి 60 వేల 431 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ.. 85 పాయింట్లు తగ్గి 17 వేల 770 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్లో లార్సెన్ అండ్ టూబ్రో మరియు టైటాన్ సంస్థల షేర్లు దాదాపు రెండు శాతం చొప్పున లాభపడ్డాయి. ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, ఐటీసీ మరియు సన్ ఫార్మా స్టాక్స్ సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించాయి.
బీఎస్ఈలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, టీసీఎస్, సిటీ యూనియన్ బ్యాంక్, ఐడీఎఫ్సీ, లుపిన్ తదితర సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ మంచి పనితీరు కనబరిచింది. ఐటీసీ, వీబీఎల్ స్టాక్స్ వ్యాల్యూ బాగా పెరిగింది. మరోవైపు.. ఐటీ ఇండెక్స్ 2 శాతం పతనమైంది. కోఫోర్జ్ సంస్థ 7 శాతానికి పైగా నేల చూపులు చూసింది.
10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా 41 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 56 వేల 700 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 408 రూపాయలు పడిపోయింది. అత్యధికంగా 66 వేల 256 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర కూడా అత్యంత స్వల్పంగా 34 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడిచమురు 6 వేల 522 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 15 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 75 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!