Today (13-02-23) Stock Market Roundup: రూ.46,045 కోట్ల అదానీ క్యాష్.. మొదటి గంటలోనే మటాష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (13-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్కి ఈ వారం శుభారంభం లభించలేదు. గ్లోబల్ మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు అందటంతో రెండు కీలక సూచీలు కూడా ఇవాళ సోమవారం ఉదయం ఫ్లాట్గానే ప్రారంభమై కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇండియా మరియు అమెరికాలో కీలకమైన ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు ముందుజాగ్రత్త పాటించారు.
అయితే.. సాయంత్రం మార్కెట్ ముగిసే ముందు జరిగిన కొన్ని డీల్స్ వల్ల కొన్ని నష్టాలనైనా పూడ్చుకోగలిగాయి. మేజర్ ఇంజనీరింగ్ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో వంటి కొన్ని కంపెనీల స్టాక్స్ కొనుగోళ్లు తాజాగా జరగటంతో ఈ మాత్రమైనా కోలుకోగలిగాయి. అయితే.. మార్కెట్ ప్రారంభమైన మొదటి గంటలోనే అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా మునిగాయి. దీంతో గ్రూపులోని మొత్తం 9 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైంది.
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
Tech Layoffs to Continue: మరికొన్నాళ్లపాటు కొనసాగనున్న టెక్ లేఆఫ్లు
చివరికి.. సెన్సెక్స్ 250 పాయింట్లు కోల్పోయి 60 వేల 431 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ.. 85 పాయింట్లు తగ్గి 17 వేల 770 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్లో లార్సెన్ అండ్ టూబ్రో మరియు టైటాన్ సంస్థల షేర్లు దాదాపు రెండు శాతం చొప్పున లాభపడ్డాయి. ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, ఐటీసీ మరియు సన్ ఫార్మా స్టాక్స్ సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించాయి.
బీఎస్ఈలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, టీసీఎస్, సిటీ యూనియన్ బ్యాంక్, ఐడీఎఫ్సీ, లుపిన్ తదితర సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ మంచి పనితీరు కనబరిచింది. ఐటీసీ, వీబీఎల్ స్టాక్స్ వ్యాల్యూ బాగా పెరిగింది. మరోవైపు.. ఐటీ ఇండెక్స్ 2 శాతం పతనమైంది. కోఫోర్జ్ సంస్థ 7 శాతానికి పైగా నేల చూపులు చూసింది.
10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా 41 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 56 వేల 700 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 408 రూపాయలు పడిపోయింది. అత్యధికంగా 66 వేల 256 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర కూడా అత్యంత స్వల్పంగా 34 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడిచమురు 6 వేల 522 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 15 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 75 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?