హుజురాబాద్ ఆటలో ‘అరటిపండు’ ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్ని అనుకూలిస్తే ఆ నేత హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేవాడు. కానీ అతడి వ్యూహం బెడిసి కొట్టడంతో ఆ సీటు చివరి నిమిషంలో దూరమైంది. దీంతో ఆ నేతకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు సదరు నేతకు శాసన మండలిలో అడుగు పెడుతారని అంతా భావించారు. అయితే ఇక్కడ కూడా ఆయనకు నిరాశ తప్పలేదు. ఇప్పటికే ఆ నేత ఎవరో ఓ క్లారిటీ వచ్చేసింది అనుకుంటా. ఆయనెవరో కాదో హుజురాబాద్ టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ తరుపున పోటీ చేశాడు. యువనేతగా గుర్తింపు తెచ్చుకున్న కౌశిక్ రెడ్డి నాటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు గట్టి పోటీ ఇచ్చాడు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే టీఆర్ఎస్ లో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆపార్టీకి ఈటల రాజేందర్ రాజీనామా చేశాడు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి బరిలో దిగుతాడని అంతా భావించారు. కానీ అనుహ్యంగా ఆయనకు టీఆర్ఎస్ టిక్కెట్ దూరమైంది.
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
కాంగ్రెస్ లో ఉంటూ టీఆర్ఎస్ టిక్కెట్ తనకే ఖాయమైందనే కౌశిక్ రెడ్డి ఫోన్ కాల్ సంభాషణ లీకైంది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. అయితే ఆయన ఆశించినట్లుగా అతడికి హుజూరాబాద్ టిక్కెట్ దక్కలేదు. బీసీ వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టీఆర్ఎస్ హుజురాబాద్ టిక్కెట్ దక్కింది. ఈక్రమంలోనే కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు. ఈమేరకు గవర్నర్ ఆమోదం కోసం ఫైల్ ను రాజ్ భవన్ కు పంపారు.
అన్ని అనుకూలిస్తే ఆయన ఎమ్మెల్సీ హోదాలో హుజూరాబాద్ లో జరిగే సభలు, సమావేశాలకు హాజరయ్యేవాడు. కానీ అతడి బ్యాడ్ లక్కేంటో తెలియదు కానీ గవర్నర్ మాత్రం ఆ ఫైల్ ను ఆమోదించకుండా హోల్డ్ లో పెట్టారు. సేవా కోటాలో కౌశిక్ రెడ్డి పేరును చేర్చడంపై గవర్నర్ తమిళ సై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని గవర్నర్ చెబుతున్నారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవీ హుజూరాబాద్ ఎన్నికల ఫలితం వెలువడే దాకా వాయిదా పడే అవకాశం కన్పిస్తుంది. ఆ తర్వాతే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మొత్తానికి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ లోని సీనియర్లను కాదని కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవీని ఆఫర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం హుజూరాబాద్లో ఎన్నికల హీట్ మొదలు కావడంతో అందరిదృష్టి ఈ ఎన్నికపైనే పడింది. ఇక్కడ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా వార్ కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి సైతం టీఆర్ఎస్ అభ్యర్థి తరుపున జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ చూస్తుంటే దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదన్నట్లుగా తయారైంది. దీంతో తమ నేతకు కాలం ఎప్పుడు కలిసి వస్తుందోనని కౌశిక్ రెడ్డి అభిమానులు ఎదురుచూస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే అతడి భవిష్యత్ కు ఢోకా ఉండదని అర్థమవుతుంది. కానీ ఫలితం రివర్స్ అయితే కౌశిక్ రెడ్డి పరిస్థితి ఏంటనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!