భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ అయిన వేద కృష్ణమూర్తి ఇంట్లో విషాదం నెలకొంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా వేద సోదరి వత్సల శివకుమార్ మృతి చెందారు. గత నెల వేద సోదరికి కరోనా సోకగా.. ఈరోజు ఆమె కన్నుమూశారు. ఈ విషయాన్ని వేద కృష్ణమూర్తి మాజీ కోచ్ ఇర్ఫాన్ సైత్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తెలిపారు. రెండు వారాల క్రితమే వేద తల్లి కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక వేద కృష్ణమూర్తి భారత జట్టుకు 48 వన్డేలు, 76 టీ20 మ్యాచ్లలో ప్రాతినిథ్యం వహించారు. వన్డేల్లో 829 పరుగులు.. చేయగా.. టీ20ల్లో 875 రన్స్ చేసారు. అలాగే రెండు ఫార్మాట్లలో కలిపి 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.