తల్లి కుమారుడిని బలిగొన్న కరోనా.. పోరాడుతున్న సోదరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల వ్యవధిలో కరోనా మహమ్మారితో తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తోండుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోదరి మృత్యువుతో హాస్పిటల్ లో పోరాడుతుంది. తోండుపల్లి గ్రామానికి చెందిన పెదిరిపాటి సుభాష్ గౌడ్ (50) చంద్రిక దంపతులకు ఏప్రిల్ 28న, 25వ వివాహ మహోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అయితే అప్పటికే సుభాష్ గౌడ్ తో పాటు అయన భార్య చంద్రిక, కుమారుడు, తల్లి సోదరికి కరోనా సోకింది. సాధారణ జ్వరం అనుకుని నిర్లక్ష్యం చేశారు. మే 1న సుభాష్ గౌడ్ తల్లి సులోన (70) ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో సమీపంలోని అస్పటల్ కు తరలించారు. దీంతో చికిత్స పొందుతూ మే 12న మృతి చెందింది. అప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుభాష్ గౌడ్ తల్లి అంతక్రియల్లో పాల్గోన్నాడు. మరుసటిరోజు పరిస్థితి విషమించడంతో అస్పటల్ కు తరలించగా 25 రోజులు కోవిడ్ తో పోరాడి మృతి చెందాడు. వైద్య ఖర్చుల కోసం దాదాపు 31 లక్షలు కర్చు చేసిన ఫలితం లేదు. ప్రస్తుతం సుభాష్ గౌడ్ సోదరి ఒ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పోందుతుంది. సుభాష్ గౌడ్ భార్య ఇంటివద్దనే ఉండి కరోనాను జయించగా కుమారుడును వారం రోజులు హాస్పిటల్ లో ఉండి కోలుకున్నాడు.
Also Read
తాజావార్తలు
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!