తల్లి కుమారుడిని బలిగొన్న కరోనా.. పోరాడుతున్న సోదరి
నెల వ్యవధిలో కరోనా మహమ్మారితో తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తోండుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోదరి మృత్యువుతో హాస్పిటల్ లో పోరాడుతుంది. తోండుపల్లి గ్రామానికి చెందిన పెదిరిపాటి సుభాష్ గౌడ్ (50) చంద్రిక దంపతులకు ఏప్రిల్ 28న, 25వ వివాహ మహోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అయితే అప్పటికే సుభాష్ గౌడ్ తో పాటు అయన భార్య చంద్రిక, కుమారుడు, తల్లి సోదరికి కరోనా సోకింది. సాధారణ జ్వరం అనుకుని నిర్లక్ష్యం చేశారు. మే 1న సుభాష్ గౌడ్ తల్లి సులోన (70) ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో సమీపంలోని అస్పటల్ కు తరలించారు. దీంతో చికిత్స పొందుతూ మే 12న మృతి చెందింది. అప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుభాష్ గౌడ్ తల్లి అంతక్రియల్లో పాల్గోన్నాడు. మరుసటిరోజు పరిస్థితి విషమించడంతో అస్పటల్ కు తరలించగా 25 రోజులు కోవిడ్ తో పోరాడి మృతి చెందాడు. వైద్య ఖర్చుల కోసం దాదాపు 31 లక్షలు కర్చు చేసిన ఫలితం లేదు. ప్రస్తుతం సుభాష్ గౌడ్ సోదరి ఒ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పోందుతుంది. సుభాష్ గౌడ్ భార్య ఇంటివద్దనే ఉండి కరోనాను జయించగా కుమారుడును వారం రోజులు హాస్పిటల్ లో ఉండి కోలుకున్నాడు.
Also Read
తాజావార్తలు
-
UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
Toxic: యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!