ఐపీఎల్ 2021 లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆగంగేట్రం చేసిన యువ పేసర్ చేతన్ సకారియా ఇంట్లో విషాదం నెలకొంది. కరోనా వైరస్ బారిన పడిన అతని తండ్రి ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే ఈ ఏడాది జనవరిలో సకారియా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషాదం నుంచి కుటుంబం కోలుకోకముందే కరోనా అతని తండ్రిని బలి తీసుకుంది. అయితే ఐపీఎల్ 2021 సీజన్ కోసం జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ చేతన్ సకారియాను రూ. కోటి 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ సంపాదనతోనే తన తండ్రికి మెరుగైన చికిత్స అందిస్తున్నానని, ఐపీఎల్ 2021 సీజన్ తన జీవితాన్ని మార్చిందని చేతన్ సకారియా తెలిపిన విషయం తెలిసిందే.