హ్యుందాయ్పై తీవ్రప్రభావం చూపిన ఆ పోస్ట్… నెటిజన్లు తీవ్ర ఆగ్రహం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఎక్కువ కార్లను తయారు చేసే కంపెనీల్లో హ్యుందాయ్ ఒకటి. ప్రపంచలో హ్యుందాయ్ కంపెనీకి భారత్ అతిపెద్ద మార్కెట్. ఇండియాలో అనేక ప్రాంతాల్లో ఈ కంపెనీ తన ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ తయారయ్యే కార్లకు ప్రపంచంలో డిమాండ్ అధికంగా ఉంటున్నది. అయితే, హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విట్టర్లో చేసిన ఓ పోస్ట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాయ్కాట్ హ్యుందాయ్ పేరుతో ట్రెండ్ అయింది. పాకిస్తాన్లో హ్యుందాయ్ కంపెనీ అధికారిక ఖాతా ట్విట్టర్లో కాశ్మీర్పై ఓ పోస్ట్ చేసింది. కాశ్మీర్ కోసం ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుందాం స్వాతంత్య్రం కోసం వారు చేస్తున్న పోరాటానికి అండగా నిలుద్దామం అని చెప్పి పోస్ట్ చేసింది. ఈ పోస్టింగ్ ఇప్పుడు వివాదానికి దారితీసింది.
Read: ఊ అంటావా ఉహు అంటావా అంటున్న వధూవరులు… నెటిజన్లు ఫిదా…
Also Read
- Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
- రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
- కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
- 144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ఈ పోస్టింగ్ కాశ్మీర్ వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చేలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. సామాన్య ప్రజల నుంచి రాజకీయ నేతల వరకు హ్యుందాయ్ కంపెనీపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయితే, పోస్ట్ చేసిన కాసేపటికీ హ్యుందాయ్ కంపెనీ ఆ పోస్టింగ్ను డిలీట్ చేసింది. అయినప్పటికీ ఆ కంపెనీ షేర్ చేసిన పోస్టింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్లు చేశారు. దీంతో దిగొచ్చిన హ్యుందాయ్ కంపెనీ భారత్లో 25 ఏళ్లుగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నామని, జాతీయవాదానికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని, సున్నితమైన విషయాల్లో తాము కఠినంగా ఉంటామని వివరణ ఇచ్చింది. అయితే, హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి చేసిన పోస్టింగ్ను ఖండిస్తున్నట్టు వివరణలో పేర్కొనకపోవడంతో ఈ వివాదంపై మరింత దుమారం రేగింది. బీజేపీ, శివసేన నేతలు హ్యుందాయ్ వివరణపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వివరణ సంతృప్తికరంగా లేదని, హ్యుందాయ్ కంపెనీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!