హ్యుందాయ్పై తీవ్రప్రభావం చూపిన ఆ పోస్ట్… నెటిజన్లు తీవ్ర ఆగ్రహం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఎక్కువ కార్లను తయారు చేసే కంపెనీల్లో హ్యుందాయ్ ఒకటి. ప్రపంచలో హ్యుందాయ్ కంపెనీకి భారత్ అతిపెద్ద మార్కెట్. ఇండియాలో అనేక ప్రాంతాల్లో ఈ కంపెనీ తన ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ తయారయ్యే కార్లకు ప్రపంచంలో డిమాండ్ అధికంగా ఉంటున్నది. అయితే, హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విట్టర్లో చేసిన ఓ పోస్ట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాయ్కాట్ హ్యుందాయ్ పేరుతో ట్రెండ్ అయింది. పాకిస్తాన్లో హ్యుందాయ్ కంపెనీ అధికారిక ఖాతా ట్విట్టర్లో కాశ్మీర్పై ఓ పోస్ట్ చేసింది. కాశ్మీర్ కోసం ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుందాం స్వాతంత్య్రం కోసం వారు చేస్తున్న పోరాటానికి అండగా నిలుద్దామం అని చెప్పి పోస్ట్ చేసింది. ఈ పోస్టింగ్ ఇప్పుడు వివాదానికి దారితీసింది.
Read: ఊ అంటావా ఉహు అంటావా అంటున్న వధూవరులు… నెటిజన్లు ఫిదా…
Also Read
- Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
- Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే 'ఒకే ఒక్కడు'!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
ఈ పోస్టింగ్ కాశ్మీర్ వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చేలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. సామాన్య ప్రజల నుంచి రాజకీయ నేతల వరకు హ్యుందాయ్ కంపెనీపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయితే, పోస్ట్ చేసిన కాసేపటికీ హ్యుందాయ్ కంపెనీ ఆ పోస్టింగ్ను డిలీట్ చేసింది. అయినప్పటికీ ఆ కంపెనీ షేర్ చేసిన పోస్టింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్లు చేశారు. దీంతో దిగొచ్చిన హ్యుందాయ్ కంపెనీ భారత్లో 25 ఏళ్లుగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నామని, జాతీయవాదానికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని, సున్నితమైన విషయాల్లో తాము కఠినంగా ఉంటామని వివరణ ఇచ్చింది. అయితే, హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి చేసిన పోస్టింగ్ను ఖండిస్తున్నట్టు వివరణలో పేర్కొనకపోవడంతో ఈ వివాదంపై మరింత దుమారం రేగింది. బీజేపీ, శివసేన నేతలు హ్యుందాయ్ వివరణపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వివరణ సంతృప్తికరంగా లేదని, హ్యుందాయ్ కంపెనీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
-
T20I Matches: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. టీ20 మ్యాచ్ల వేళల్లో మార్పులు.. ఒక గంట ముందుగానే..
-
Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
-
Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
-
India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!