South Korea: 4 నిమిషాలు టాయిలెట్కి వెళ్లిన ట్రైన్ ఆపరేటర్.. ఏకంగా125 రైళ్లు ఆలస్యం!
- దక్షిణ కొరియా రాజధాని సియోల్ నుంచి ఓ ఆశ్చర్యకరమైన వార్త
- నాలుగు నిమిషాలు టాయిలెట్కి వెళ్లిన ట్రైన్ ఆపరేటర్
- ఆలస్యంగా నడిచిన 125 రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ కొరియా రాజధాని సియోల్ నుంచి ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. దక్షిణ కొరియాలోని సబ్వేలో పనిచేస్తున్న ట్రైన్ ఆపరేటర్ కొద్దిసేపు విరామం తీసుకోవడంతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ విరామం కారణంగా 125 రైళ్లు 20 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. కండక్టర్ కొన్ని నిమిషాలు మాత్రమే విరామం తీసుకున్నాడు. కానీ.. ఈ టాయిలెట్ బ్రేక్ ప్రయాణీకులకు ఖరీదైనదిగా మారింది.
READ MORE: Maharashtra CM Post: సీఎం ఎంపికపై బీజేపీ హైకమాండ్ హైరానా! కారణమిదేనా?
Also Read
- రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
- 50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
- 10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
- Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
కొరియన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో కనీసం 125 రైళ్లు రైలు ఆపరేటర్ నాలుగు నిమిషాల టాయిలెట్ బ్రేక్ తీసుకోవడం వల్ల ఆలస్యంగా నడిచాయి. వందలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 8 గంటలకు సియోల్లోని లైన్ 2లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఔటర్ లూప్పై నడుస్తున్న రైలు అకస్మాత్తుగా స్టేషన్లో ఆగిపోయింది. ఆపరేటర్ కు టాయిలెట్ వచ్చింది. దీంతో అతడు ప్లాట్ఫారమ్పైకి పరిగెత్తాడు. టాయిలెట్ రెండవ అంతస్తులో ఉన్నందున.. రైలు ఆపరేటర్ తన క్యాబిన్కు తిరిగి రావడానికి 4 నిమిషాల 16 సెకన్లు పట్టింది.
READ MORE:Bangladesh: బంగ్లాదేశ్లో రెండో హిందూ పూజారి అరెస్ట్..
దీని వల్ల డొమినో ప్రభావం ఏర్పడింది. సియోల్ మెట్రో ప్రకారం.. ఈ రైలు అకస్మాత్తుగా ఆగిపోవడంతో ఇదే సర్క్యులర్ లైన్లో నడుస్తున్న మరో 125 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఇందులో కొన్ని రైళ్లు 20 నిమిషాలకు పైగా ఆలస్యమయ్యాయి. కాగా.. దక్షిణ కొరియాలో రైళ్ల రాకపోకల షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. కండక్టర్లు విరామం లేకుండా రెండు మూడు గంటలు పనిచేయడం అలవాటు చేసుకున్నారు. కొన్నిసార్లు అత్యవసర అవసరాలు తలెత్తినప్పుడు.. వారికి కష్టంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో పోర్టబుల్ టాయిలెట్లు అందుబాటులో ఉంటాయి. అయితే.. ఈసారి మాత్రం ఆపరేటర్ స్టేషన్లోని టాయిలెట్ను ఎంచుకున్నాడు. దీంతో ఈ ఘటన జరిగింది. ఆలస్యానికి సియోల్ మెట్రో.. ప్రయాణికులకు విచారం వ్యక్తం చేసింది. అయితే రైళ్ల రాకపోకలకు పెద్దగా జాప్యం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం.
తాజావార్తలు
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
ట్రెండింగ్
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!