South Korea: 4 నిమిషాలు టాయిలెట్కి వెళ్లిన ట్రైన్ ఆపరేటర్.. ఏకంగా125 రైళ్లు ఆలస్యం!
- దక్షిణ కొరియా రాజధాని సియోల్ నుంచి ఓ ఆశ్చర్యకరమైన వార్త
- నాలుగు నిమిషాలు టాయిలెట్కి వెళ్లిన ట్రైన్ ఆపరేటర్
- ఆలస్యంగా నడిచిన 125 రైళ్లు
దక్షిణ కొరియా రాజధాని సియోల్ నుంచి ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. దక్షిణ కొరియాలోని సబ్వేలో పనిచేస్తున్న ట్రైన్ ఆపరేటర్ కొద్దిసేపు విరామం తీసుకోవడంతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ విరామం కారణంగా 125 రైళ్లు 20 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. కండక్టర్ కొన్ని నిమిషాలు మాత్రమే విరామం తీసుకున్నాడు. కానీ.. ఈ టాయిలెట్ బ్రేక్ ప్రయాణీకులకు ఖరీదైనదిగా మారింది.
READ MORE: Maharashtra CM Post: సీఎం ఎంపికపై బీజేపీ హైకమాండ్ హైరానా! కారణమిదేనా?
Also Read
- 3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
- స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
- స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
- Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
కొరియన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో కనీసం 125 రైళ్లు రైలు ఆపరేటర్ నాలుగు నిమిషాల టాయిలెట్ బ్రేక్ తీసుకోవడం వల్ల ఆలస్యంగా నడిచాయి. వందలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 8 గంటలకు సియోల్లోని లైన్ 2లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఔటర్ లూప్పై నడుస్తున్న రైలు అకస్మాత్తుగా స్టేషన్లో ఆగిపోయింది. ఆపరేటర్ కు టాయిలెట్ వచ్చింది. దీంతో అతడు ప్లాట్ఫారమ్పైకి పరిగెత్తాడు. టాయిలెట్ రెండవ అంతస్తులో ఉన్నందున.. రైలు ఆపరేటర్ తన క్యాబిన్కు తిరిగి రావడానికి 4 నిమిషాల 16 సెకన్లు పట్టింది.
READ MORE:Bangladesh: బంగ్లాదేశ్లో రెండో హిందూ పూజారి అరెస్ట్..
దీని వల్ల డొమినో ప్రభావం ఏర్పడింది. సియోల్ మెట్రో ప్రకారం.. ఈ రైలు అకస్మాత్తుగా ఆగిపోవడంతో ఇదే సర్క్యులర్ లైన్లో నడుస్తున్న మరో 125 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఇందులో కొన్ని రైళ్లు 20 నిమిషాలకు పైగా ఆలస్యమయ్యాయి. కాగా.. దక్షిణ కొరియాలో రైళ్ల రాకపోకల షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. కండక్టర్లు విరామం లేకుండా రెండు మూడు గంటలు పనిచేయడం అలవాటు చేసుకున్నారు. కొన్నిసార్లు అత్యవసర అవసరాలు తలెత్తినప్పుడు.. వారికి కష్టంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో పోర్టబుల్ టాయిలెట్లు అందుబాటులో ఉంటాయి. అయితే.. ఈసారి మాత్రం ఆపరేటర్ స్టేషన్లోని టాయిలెట్ను ఎంచుకున్నాడు. దీంతో ఈ ఘటన జరిగింది. ఆలస్యానికి సియోల్ మెట్రో.. ప్రయాణికులకు విచారం వ్యక్తం చేసింది. అయితే రైళ్ల రాకపోకలకు పెద్దగా జాప్యం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం.
తాజావార్తలు
-
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
-
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
-
Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
-
Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
-
RBI Gold Reserves: భారత్కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!