‘మంగళవారం మరదలు’ అన్న మంత్రి నిరంజన్రెడ్డి… ఏకిపారేసిన వైఎస్ షర్మిల
నాగర్ కర్నూలులో బుధవారం జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలను ఉద్దేశించి ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ దీక్షలు చేయడానికి మంగళవారం మరదలు బయలుదేరింది’ అంటూ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడారు. షర్మిల డిమాండ్ వెనుక ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని ఆయన ఆరోపించారు.
Read Also: కేసీఆర్-జగన్లపై రేవంత్ ట్వీట్ వార్
Also Read
అయితే తనను ఉద్దేశించి మంత్రి నిరంజన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చందమామను చూసి కుక్కలు మొరుగుతుంటాయని, అలాంటి కుక్కలను తరిమికొట్టే రోజు వస్తుందని షర్మిల కౌంటర్ ఇచ్చారు. కాగా షర్మిల ప్రస్తుతం ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పర్యటిస్తున్నారు. మరోవైపు మంత్రి నిరంజన్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని వైఎస్ఆర్ టీపీ పిలుపునిచ్చింది. పార్టీ కన్వీనర్లు, కో -కన్వీనర్లు, దళిత, మైనార్టీ, యువజన విభాగాల నాయకులు వారి పరిధిలో మంత్రి నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయడంతో పాటు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని సూచించింది.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!