షర్మిల రాజకీయం @ అచ్చం అన్న తీరుగా.. జన సమీకరణలో మేటిగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించినప్పటి నుంచి.. వరుసగా సభలు నిర్వహిస్తూ పోతున్నారు. రాజకీయంగా ఆమె చేస్తున్న విమర్శలు, తిరిగి ఆమెపై వస్తున్న ప్రతి విమర్శలు పక్కన పెడితే.. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల వేస్తున్న అడుగులు.. ముచ్చటగా ఉన్నాయని.. న్యూట్రల్ పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా.. వైఎస్ జగన్ తోడబుట్టిన సోదరిగా.. ఆమె ప్రతిభ చాటుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు.
సాధారణంగా.. జగన్ ఏ ర్యాలీ చేసినా.. ఏ సభ నిర్వహించినా.. జన ప్రవాహం వెల్లువెత్తుతుంటుంది. తండోపతండాలుగా జనం తరలివస్తుంటారు. ఆ దిశగా.. పార్టీ నాయకత్వం సైతం సమర్థంగా పని చేస్తుంటుంది. 2019లో జరిగిన ఎన్నికలు కావచ్చు.. అంతకు ముందు ఓదార్పు యాత్ర కావచ్చు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన దీక్షలు కావచ్చు. ఏదైనా సరే.. జనాలు మాత్రం భారీగానే తరలివచ్చేవారు. జగన్ కు సంఘీభావం తెలిపేవారు.
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- Maharashtra: నాందేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
ఈ క్రమంలో.. జగన్ 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసినప్పుడు.. షర్మిల ఎంతగానో సహకరించారు. జగన్ గైర్హాజరీలో.. తానే స్వయంగా జగనన్న వదిలిన బాణంగా ముందుకు కదిలారు. ప్రజలతో మమేకమయ్యారు. అందరినీ కలుపుకొనిపోయారు. ఆ అనుభవం.. ఇప్పుడు షర్మిలకు తెలంగాణ రాజకీయాల్లో బాగా కలిసి వస్తున్నట్టు కనిపిస్తోంది. అది… ఆమె నిర్వహించిన దళిత భేరి సభలో.. నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం చేస్తున్న దీక్షల్లో స్పష్టమవుతోంది.
అయితే.. షర్మిల వెనక ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహకర్త ఉన్నారని.. ఆయన దిశానిర్దేశంలోనే షర్మిల రాజీకీయాలు చేస్తున్నారని వాదించేవారు సైతం ఉన్నారు. కానీ.. తనకంటూ ఓ పొలిటికల్ గ్లామర్ లేకుండా.. వెనకాల ప్రశాంత్ కిషోర్ ఉన్నా.. జగన్ ఉన్నా.. మరెవరు ఉన్నా.. షర్మిల స్వయంగా ఇంత ముందుకు వెళ్లలేదని అనేవాళ్లు కూడా ఉన్నారు. ఆమె సభలకు చెప్పుకోదగ్గ సంఖ్యలో వస్తున్న ప్రజలే.. ఈ చర్చకు కేంద్రంగా నిలుస్తున్నారు.
కరోనా పరిస్థితులు తగ్గాక.. షర్మిల సభలకు, దీక్షలకు మరింతగా జనాలు హాజరయ్యే అవకాశాలు లేకపోలేదని.. రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Lala Amarnath: భారత్కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
-
BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
-
Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
-
Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!