అప్పుడు భూమిక… ఇప్పుడు పూజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర విచిత్రమైన సంఘటనలకు మన సినిమా పరిశ్రమ వేదిక అవుతూ ఉంటుంది. అలాంటి సంఘటనలు తలచుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. తాజాగా అలాంటి యాదృచ్చికమైన విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఈ సంఘటనకు కారకులు భూమిక, పూజాహేగ్డే కావటం విశేషం.
2000లో ‘యువకుడు’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింద భూమిక. ఆ తర్వాత ఏడాదే పవన్ కళ్యాణ్ తో ‘ఖుషీ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవటంతో భూమికకు వెనుదిరిగి చూసుకునే అవసరం లేకపోయింది. అయితే ‘ఖుషీ’ పవన్ కి 7వ సినిమా. ఆ తర్వాత 2003లో మహేశ్ బాబుతో ‘ఒక్కడు’, ఎన్టీఆర్ తో ‘సింహాద్రి’ సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది భూమిక. ఆ సినిమాలు మహేశ్, ఎన్టీఆర్ కి 7వ సినిమాలు కావటం అవి రెండు కూడా సూపర్ డూపర్ హిట్ కావటం గమనార్హం. ఇలా ముగ్గురు హీరోల 7వ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావటం… అందులో భూమిక హీరోయిన్ కావటమే అసలు సిసలు ట్విస్ట్.
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ఇక ప్రస్తుతానికి వస్తే 2014లో ‘ఒక లైలా కోసం’ సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూజా హేగ్డే. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తెలుగునాట స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. 2018లో ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో నాయికగా నటించటం… అది హిట్ కావటం జరిగింది. ఈ సినిమా హీరోగా ఎన్టీఆర్ కి 28వ చిత్రం. గత ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘అల వైకుంఠపురం’లోనూ పూజనే హీరోయిన్. ప్రస్తుతం ‘రాధేశ్యామ్, ఆచార్య’ వంటి సినిమాలో పాటు తమిళంలో ‘బీస్ట్’, బాలీవుడ్ లో ‘సర్కస్, భాయిజాన్’ సినిమాల్లో నటిస్తోంది. వాటితో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించే సినిమాలోనూ, హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించే సినిమాలోనూ పూజనే హీరోయిన్ గా కన్ ఫామ్ చేశారు. ఈ రెండు సినిమాలు మహేశ్, పవన్ కళ్యాణ్ కి 28వ సినిమాలు కావటం విశేషం. సో అప్పట్లో ఈ ముగ్గురు హీరోల 7వ సినిమాలో భూమిక హీరోయిన్ కాగా… ఇప్పుడు 28వ సినిమాలో పూజా హేగ్డే కథానాయిక. అప్పుడు భూమిక నటించిన ఈ ముగ్గురు హీరోల సినిమా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు పూజ నటించిన ఎన్టీఆర్ 28వ సినిమా ‘అరవింద సమేత’ ఘనవిజయం సాధించింది. సెంటిమెంట్ గా మహేశ్, పవన్ సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయేమో చూద్దాం.
తాజావార్తలు
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..