అప్పుడు భూమిక… ఇప్పుడు పూజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర విచిత్రమైన సంఘటనలకు మన సినిమా పరిశ్రమ వేదిక అవుతూ ఉంటుంది. అలాంటి సంఘటనలు తలచుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. తాజాగా అలాంటి యాదృచ్చికమైన విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఈ సంఘటనకు కారకులు భూమిక, పూజాహేగ్డే కావటం విశేషం.
2000లో ‘యువకుడు’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింద భూమిక. ఆ తర్వాత ఏడాదే పవన్ కళ్యాణ్ తో ‘ఖుషీ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవటంతో భూమికకు వెనుదిరిగి చూసుకునే అవసరం లేకపోయింది. అయితే ‘ఖుషీ’ పవన్ కి 7వ సినిమా. ఆ తర్వాత 2003లో మహేశ్ బాబుతో ‘ఒక్కడు’, ఎన్టీఆర్ తో ‘సింహాద్రి’ సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది భూమిక. ఆ సినిమాలు మహేశ్, ఎన్టీఆర్ కి 7వ సినిమాలు కావటం అవి రెండు కూడా సూపర్ డూపర్ హిట్ కావటం గమనార్హం. ఇలా ముగ్గురు హీరోల 7వ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావటం… అందులో భూమిక హీరోయిన్ కావటమే అసలు సిసలు ట్విస్ట్.
Also Read
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
- PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
- Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
ఇక ప్రస్తుతానికి వస్తే 2014లో ‘ఒక లైలా కోసం’ సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూజా హేగ్డే. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తెలుగునాట స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. 2018లో ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో నాయికగా నటించటం… అది హిట్ కావటం జరిగింది. ఈ సినిమా హీరోగా ఎన్టీఆర్ కి 28వ చిత్రం. గత ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘అల వైకుంఠపురం’లోనూ పూజనే హీరోయిన్. ప్రస్తుతం ‘రాధేశ్యామ్, ఆచార్య’ వంటి సినిమాలో పాటు తమిళంలో ‘బీస్ట్’, బాలీవుడ్ లో ‘సర్కస్, భాయిజాన్’ సినిమాల్లో నటిస్తోంది. వాటితో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించే సినిమాలోనూ, హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించే సినిమాలోనూ పూజనే హీరోయిన్ గా కన్ ఫామ్ చేశారు. ఈ రెండు సినిమాలు మహేశ్, పవన్ కళ్యాణ్ కి 28వ సినిమాలు కావటం విశేషం. సో అప్పట్లో ఈ ముగ్గురు హీరోల 7వ సినిమాలో భూమిక హీరోయిన్ కాగా… ఇప్పుడు 28వ సినిమాలో పూజా హేగ్డే కథానాయిక. అప్పుడు భూమిక నటించిన ఈ ముగ్గురు హీరోల సినిమా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు పూజ నటించిన ఎన్టీఆర్ 28వ సినిమా ‘అరవింద సమేత’ ఘనవిజయం సాధించింది. సెంటిమెంట్ గా మహేశ్, పవన్ సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయేమో చూద్దాం.
తాజావార్తలు
-
Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
-
PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
-
YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
-
Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?