పశ్చిమగోదావరిలో ఒమిక్రాన్ టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమగోదావరి జిల్లాలో ఒమిక్రాన్ వైరస్ టెన్షన్ మొదలైంది. జిల్లాలో ఒమిక్రాన్ కేసులకు సంబంధించిన వివరాలను కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని, భయపడవద్దన్నారు. ఈ నెల 21 న ఏలూరు రూరల్ పత్తి కోళ్ల లంకలో కువైట్ నుండి వచ్చిన 41 సంవత్సరాల మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు ఇది.
ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది ఆమెను హోమ్ ఐసోలేషన్ లో ఉంచామని కలెక్టర్ చెప్పారు. గత 45 రోజుల్లో జిల్లాకు 6,856 మంది విదేశాలనుండి వచ్చారు.ఎయిర్ పోర్టు లొనే ఆర్టీపీసీ ఆర్ టెస్ట్ లు చేస్తున్నాం అన్నారు. 14 మంది కోవిడ్ పాజిటీవ్ అని తేలింది. 4,200 మందికి 8 రోజుల అనంతరం మరోసారి టెస్టులు చేశాం. ప్రైమరీ కాంటాక్ట్స్ నెగిటివ్ అని తేలాయి. 2600 మంది 8 రోజుల వ్యవధిలో ఉన్నారు. పాజిటివ్ ఉంటే సీసీఎంబీ ల్యాబ్ హైదరాబాద్ కు టెస్ట్ కు పంపుతున్నాం.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
పండగ వస్తున్న వేళ విదేశాలనుండి ఎక్కువ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. 8010968295 నెంబర్ కు బయట నుండి వచ్చిన వారు ఎవరైనా ఉంటే సమాచారం తెలియజేయండి. 104 కాల్ సెంటర్ ద్వారా సమాచారం సేకరిస్తున్నాం. టెస్టింగ్, క్యారంటైన్…అంశాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నామని కలెక్టర్ చెప్పారు. ప్రజలు మాస్క్ ,సోషల్ డిస్టెన్స్ తప్పసరిగా పాటించాలి. పండుగ తరుణంలో పబ్లిక్ ఏరియాలో,షాపింగ్ కాంప్లెక్స్ ల్లో ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదు.
18 సంవత్సరాలు నిండిన వారికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ జిల్లాలో 100 శాతం పూర్తి చేశామన్నారు. 75 శాతం మందికి రెండో డోస్ వ్యాక్సిన్ ఇచ్చాం. 15 నుండి18 సంవత్సరాల వారికి వ్యాక్సిన్ ప్రక్రియ జనవరి 3 నుండి మొదలు పెడతామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 1,78,000 మంది పిల్లలు ఉన్నారు..వారికి కోవాక్సిన్ డోసెస్ ఇస్తాం. జిల్లాలో 31 వేల మంది హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు. 61 వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారు. 60 సంవత్సరాలు పై బడిన 4 లక్షల26 వేలమంది జనవరి 10 నుండి ప్రికాషనరీ డోస్ అందిస్తున్నాము. కోవిడ్ నియమాలు కచ్చితంగా ప్రజలు పాటించాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!