పశ్చిమగోదావరిలో ఒమిక్రాన్ టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమగోదావరి జిల్లాలో ఒమిక్రాన్ వైరస్ టెన్షన్ మొదలైంది. జిల్లాలో ఒమిక్రాన్ కేసులకు సంబంధించిన వివరాలను కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని, భయపడవద్దన్నారు. ఈ నెల 21 న ఏలూరు రూరల్ పత్తి కోళ్ల లంకలో కువైట్ నుండి వచ్చిన 41 సంవత్సరాల మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు ఇది.
ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది ఆమెను హోమ్ ఐసోలేషన్ లో ఉంచామని కలెక్టర్ చెప్పారు. గత 45 రోజుల్లో జిల్లాకు 6,856 మంది విదేశాలనుండి వచ్చారు.ఎయిర్ పోర్టు లొనే ఆర్టీపీసీ ఆర్ టెస్ట్ లు చేస్తున్నాం అన్నారు. 14 మంది కోవిడ్ పాజిటీవ్ అని తేలింది. 4,200 మందికి 8 రోజుల అనంతరం మరోసారి టెస్టులు చేశాం. ప్రైమరీ కాంటాక్ట్స్ నెగిటివ్ అని తేలాయి. 2600 మంది 8 రోజుల వ్యవధిలో ఉన్నారు. పాజిటివ్ ఉంటే సీసీఎంబీ ల్యాబ్ హైదరాబాద్ కు టెస్ట్ కు పంపుతున్నాం.
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
పండగ వస్తున్న వేళ విదేశాలనుండి ఎక్కువ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. 8010968295 నెంబర్ కు బయట నుండి వచ్చిన వారు ఎవరైనా ఉంటే సమాచారం తెలియజేయండి. 104 కాల్ సెంటర్ ద్వారా సమాచారం సేకరిస్తున్నాం. టెస్టింగ్, క్యారంటైన్…అంశాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నామని కలెక్టర్ చెప్పారు. ప్రజలు మాస్క్ ,సోషల్ డిస్టెన్స్ తప్పసరిగా పాటించాలి. పండుగ తరుణంలో పబ్లిక్ ఏరియాలో,షాపింగ్ కాంప్లెక్స్ ల్లో ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదు.
18 సంవత్సరాలు నిండిన వారికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ జిల్లాలో 100 శాతం పూర్తి చేశామన్నారు. 75 శాతం మందికి రెండో డోస్ వ్యాక్సిన్ ఇచ్చాం. 15 నుండి18 సంవత్సరాల వారికి వ్యాక్సిన్ ప్రక్రియ జనవరి 3 నుండి మొదలు పెడతామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 1,78,000 మంది పిల్లలు ఉన్నారు..వారికి కోవాక్సిన్ డోసెస్ ఇస్తాం. జిల్లాలో 31 వేల మంది హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు. 61 వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారు. 60 సంవత్సరాలు పై బడిన 4 లక్షల26 వేలమంది జనవరి 10 నుండి ప్రికాషనరీ డోస్ అందిస్తున్నాము. కోవిడ్ నియమాలు కచ్చితంగా ప్రజలు పాటించాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Rajini – Kamal Movie Update: రజినీ – కమల్ మూవీకి షూటింగ్ అప్డేట్… మరో మూడేళ్లు తలైవా బిజీ బిజీ!
-
Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
-
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
-
Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!