Vijaya Sai Reddy: అధికార దాహంతోనే పొత్తు.. టీడీపీపై కీలక వ్యాఖ్యలు
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధికి విక్రమ్ రెడ్డి రూపొందించిన మానిఫెస్టోను విజయ సాయి రెడ్డి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం అధికార దాహంతోనే ఇప్పుడు మళ్లీ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. త్రిబుల్ తలాక్, సీఏఏ (CAA) బిల్లులకు వైసీపీ సపోర్ట్ చేయలేదని తెలిపారు. కేవలం దురుద్దేశంతో వైసీపీపై చంద్రబాబు బురద చల్లుతున్నారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
Read Also: PM Modi: 10 ఏళ్లు అధికారంలో లేకుంటే, దేశం తగలబడుతుందని అంటున్నారు..
Also Read
- IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
- PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
- Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
- Assembly Elections: తమిళనాడు, బెంగాల్లో పోటాపోటీగా పోలింగ్.. ఉ.11 గంటలకు భారీగా ఓటింగ్
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని విజయసాయి రెడ్డి విమర్శించారు. ఏ పార్టీ అయితే బీజేపీతో జతకడుతుందో ఆ పార్టీ తిరిగి ఉండదని వ్యాఖ్యానించారు. ఇక.. తాను జీవితాంతం వైఎస్సార్ ఫ్యామిలీతోనే ఉంటానని చెప్పారు. చంద్రబాబు తన కోసం, తన సామాజిక వర్గం కోసం మాత్రమే సంపద సృషించాడని ఆరోపించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చంద్రబాబు ఏమీ చేయలేదని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కుటుంబం కోసం తాను జైలుకు పోయిన మాట వాస్తవం అని చెప్పారు.
Read Also: Amit Shah: ప్రధాని మోడీ, రాహుల్ గాంధీల మధ్య పోలికే లేదు..
చంద్రబాబు 5 కేసుల్లో A1 నిందితుడు అని విజయసాయి దుయ్యబట్టారు. ప్రజల సొమ్ము దోచుకొని జైలుకు వెళ్లిన చంద్రబాబు తనను విమర్శించడం సిగ్గుచేటు అని అన్నారు. చంద్రబాబు మైండ్ అంతా నెగిటివ్ ఆలోచనలతో నిండిపోయి ఉంటుందని తెలిపారు. పార్టీకి కార్యకర్తలు నాలుగు స్తంభాల లాంటి వారని అన్నారు. కొన్ని సందర్భాల్లో అందరికీ న్యాయం చేయలేక పోవచ్చు.. వినూత్నమైన ఆలోచనలతో పరిపాలించిన జగన్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చుకుందాం అని తెలిపారు. ఆత్మకూరు ప్రాంత అభివృద్ధికి అహర్నిశలూ కృషి చేస్తానని.. కచ్చితంగా ఒక భారీ పరిశ్రమను ఈ ప్రాంతానికి తీసుకొస్తానని విజయసాయి రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Trisha : ఇట్స్ అఫీషియల్.. విజయ్’కి వోట్ వేయమని త్రిష హింట్?
-
Viral Video: భారత్ వస్తున్న నౌకను ఇరాన్ ఎలా సీజ్ చేసిందో చూడండి..
-
IPL 2026: ‘వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో’.. ఆ ఆటగాడిపై తీవ్ర ఆగ్రహం..
-
Varanasi: అంటార్కిటికాలో బాబు వేట!
-
Islamabad in Lockdown: 10 రోజులుగా లాక్డౌన్లో ఇస్లామాబాద్.. తిట్టిపోస్తున్న పాక్ ప్రజలు..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!