Vijaya Sai Reddy: అధికార దాహంతోనే పొత్తు.. టీడీపీపై కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధికి విక్రమ్ రెడ్డి రూపొందించిన మానిఫెస్టోను విజయ సాయి రెడ్డి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం అధికార దాహంతోనే ఇప్పుడు మళ్లీ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. త్రిబుల్ తలాక్, సీఏఏ (CAA) బిల్లులకు వైసీపీ సపోర్ట్ చేయలేదని తెలిపారు. కేవలం దురుద్దేశంతో వైసీపీపై చంద్రబాబు బురద చల్లుతున్నారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
Read Also: PM Modi: 10 ఏళ్లు అధికారంలో లేకుంటే, దేశం తగలబడుతుందని అంటున్నారు..
Also Read
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని విజయసాయి రెడ్డి విమర్శించారు. ఏ పార్టీ అయితే బీజేపీతో జతకడుతుందో ఆ పార్టీ తిరిగి ఉండదని వ్యాఖ్యానించారు. ఇక.. తాను జీవితాంతం వైఎస్సార్ ఫ్యామిలీతోనే ఉంటానని చెప్పారు. చంద్రబాబు తన కోసం, తన సామాజిక వర్గం కోసం మాత్రమే సంపద సృషించాడని ఆరోపించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చంద్రబాబు ఏమీ చేయలేదని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కుటుంబం కోసం తాను జైలుకు పోయిన మాట వాస్తవం అని చెప్పారు.
Read Also: Amit Shah: ప్రధాని మోడీ, రాహుల్ గాంధీల మధ్య పోలికే లేదు..
చంద్రబాబు 5 కేసుల్లో A1 నిందితుడు అని విజయసాయి దుయ్యబట్టారు. ప్రజల సొమ్ము దోచుకొని జైలుకు వెళ్లిన చంద్రబాబు తనను విమర్శించడం సిగ్గుచేటు అని అన్నారు. చంద్రబాబు మైండ్ అంతా నెగిటివ్ ఆలోచనలతో నిండిపోయి ఉంటుందని తెలిపారు. పార్టీకి కార్యకర్తలు నాలుగు స్తంభాల లాంటి వారని అన్నారు. కొన్ని సందర్భాల్లో అందరికీ న్యాయం చేయలేక పోవచ్చు.. వినూత్నమైన ఆలోచనలతో పరిపాలించిన జగన్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చుకుందాం అని తెలిపారు. ఆత్మకూరు ప్రాంత అభివృద్ధికి అహర్నిశలూ కృషి చేస్తానని.. కచ్చితంగా ఒక భారీ పరిశ్రమను ఈ ప్రాంతానికి తీసుకొస్తానని విజయసాయి రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Passport Fee: పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!