Vijaya Sai Reddy: అధికార దాహంతోనే పొత్తు.. టీడీపీపై కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధికి విక్రమ్ రెడ్డి రూపొందించిన మానిఫెస్టోను విజయ సాయి రెడ్డి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం అధికార దాహంతోనే ఇప్పుడు మళ్లీ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. త్రిబుల్ తలాక్, సీఏఏ (CAA) బిల్లులకు వైసీపీ సపోర్ట్ చేయలేదని తెలిపారు. కేవలం దురుద్దేశంతో వైసీపీపై చంద్రబాబు బురద చల్లుతున్నారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
Read Also: PM Modi: 10 ఏళ్లు అధికారంలో లేకుంటే, దేశం తగలబడుతుందని అంటున్నారు..
Also Read
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని విజయసాయి రెడ్డి విమర్శించారు. ఏ పార్టీ అయితే బీజేపీతో జతకడుతుందో ఆ పార్టీ తిరిగి ఉండదని వ్యాఖ్యానించారు. ఇక.. తాను జీవితాంతం వైఎస్సార్ ఫ్యామిలీతోనే ఉంటానని చెప్పారు. చంద్రబాబు తన కోసం, తన సామాజిక వర్గం కోసం మాత్రమే సంపద సృషించాడని ఆరోపించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చంద్రబాబు ఏమీ చేయలేదని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కుటుంబం కోసం తాను జైలుకు పోయిన మాట వాస్తవం అని చెప్పారు.
Read Also: Amit Shah: ప్రధాని మోడీ, రాహుల్ గాంధీల మధ్య పోలికే లేదు..
చంద్రబాబు 5 కేసుల్లో A1 నిందితుడు అని విజయసాయి దుయ్యబట్టారు. ప్రజల సొమ్ము దోచుకొని జైలుకు వెళ్లిన చంద్రబాబు తనను విమర్శించడం సిగ్గుచేటు అని అన్నారు. చంద్రబాబు మైండ్ అంతా నెగిటివ్ ఆలోచనలతో నిండిపోయి ఉంటుందని తెలిపారు. పార్టీకి కార్యకర్తలు నాలుగు స్తంభాల లాంటి వారని అన్నారు. కొన్ని సందర్భాల్లో అందరికీ న్యాయం చేయలేక పోవచ్చు.. వినూత్నమైన ఆలోచనలతో పరిపాలించిన జగన్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చుకుందాం అని తెలిపారు. ఆత్మకూరు ప్రాంత అభివృద్ధికి అహర్నిశలూ కృషి చేస్తానని.. కచ్చితంగా ఒక భారీ పరిశ్రమను ఈ ప్రాంతానికి తీసుకొస్తానని విజయసాయి రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!