బీసీ కమిషన్ చైర్మన్గా వకుళాభరణం.. హుజురాబాద్ బై పోల్కు లింక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్గా వకుళాభరణం కృష్ణమోహన్ రావును నియమించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో బీసీ కమిషన్లో సభ్యుడిగా ఉన్న వకుళాభరణం కృష్ణమోహన్ను ఇప్పుడు చైర్మన్ను చేశారు సీఎం కేసీఆర్… ఇక, బీసీ కమిషన్ సభ్యులుగా శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్, సీహెచ్ ఉపేంద్రను నియమించారు.. బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల హోదాలతో సమానంగా సదుపాయాలు కల్పించనుంది సర్కార్.. ఇక్కడో కీలక విషయం ఏంటంటే… వకుళాభరణం కృష్ణమోహన్ కూడా హుజురాబాద్ నియోజకవర్గ వాసియే.. త్వరలో హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. వకుళాభరణంను బీసీ కమిషన్ చైర్మన్గా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. హుజురాబాద్పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్.. ఇప్పటికే దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. అక్కడి నుంచి అమలు చేస్తున్నారు.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీని వీడిన కౌశిక్రెడ్డిని ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.. ఇప్పుడు కృష్ణమోహన్కు బీసీ కమిషన్ చైర్మన్ పదవి దక్కింది.
Also Read
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!