కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ సభ్యత్వ నమోదుపై చర్చించారు. అంతేకాకుండా 2023లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. హుజుర్ నగర్, కోదాడ ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం మాఫియాలో మునిగితేలుతున్నారని, వచ్చే ఎన్నికల్లో హుజుర్ నగర్, కోదాడలో భారీ మెజార్టీతో గెలుస్తామన్నారు.
అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని, ఏడాది తరువాత టీఆర్ఎస్ పీడ వదులుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులను ఇబ్బంది పెట్టే అధికారుల భరతం పడుతామని, తెలంగాణలో టీఆర్ఎస్, పోలీసుశాక మిత్రపోంగా పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్లో కిందిస్థాయి కార్యకర్త నుంచి సీనియర్ నేతల వరకు అందరూ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించేందుకు అహర్నిషలు కృషిచేయాలని పిలుపునిచ్చారు.