టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. అయోమయంలో తెలంగాణ రైతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు సరైన సమయంలో వర్షాలు కురియక రైతులు ఆందోళన చెందేవారు. ఒక్కోసారి అతి వర్షాలు కురిసి పంటకు నష్ట వాటిల్లేది. ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్న రైతులు ఎప్పుడూ వినని మాటలు రాజకీయ నాయకుల నోటి నుంచి వింటున్నారు. ఆ మాటలతో ఏం చేయాలో రైతులకు పాలుపోవడం లేదు. ఓ రాజకీయ పార్టీ అధినేత వరి వేస్తే ఊరే అంటే.. మరో రాజకీయ పార్టీ నేత వరి వేయండి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కొనిపిస్తానంటున్నారు.. ఇలా రాజకీయ పార్టీల నాయకులు సందేశాలతో తెలంగాణాలోని రైతులు అయోమయంలో పడిపోయారు.
అసలు విషయం ఏంటంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే యాసంగిలో వరి వేయకండి.. అలా వేస్తే మేము వరి ధాన్యం కొనుగోలు చేయం.. అని ఖరాఖండిగా చెప్పారు. కేసీఆర్ మాటలపై స్పందించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రైతులు వరి వేయండి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయమంటోంది.. అందుకే మీరు వరి వేయకండని సీఎం కేసీఆర్ అంటుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి చెందిన నాయకుడు వరి వేయండి మేము కొనుగోల్లు చేపిస్తామంటూ చేసే వాగ్దానాలపై ఎవరి మాటలు నమ్మాలో రైతులకు ఆర్థం కావడం లేదు. ఇప్పటికే వానాకాలంలో వరి ధాన్యం కొనుగోల్లు ఆలస్యమవుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read
- Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
వానాకాలంలో పండించిన ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ సర్కార్ హామీ ఇచ్చినా.. యాసంగిలో వేయాల్సిన పంటలపై క్లారిటీ రాకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. ‘దున్నపోతు..దున్నపోతు.. పోట్లాడుకుంటే లేగదూడ కాలు విరిగినట్లు’ రాజకీయ పార్టీలు వారి లబ్దికోసం రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారనే భావన కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా రైతులు వచ్చే యాసంగిలో వరి మినహా వేరే పంటలు వేసుకోవాలని సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించి మరీ ఓ క్లారిటీ అయితే ఇచ్చారు… కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న.. బీజేపీ నేత బండి కేంద్రంతో వరి ధాన్యం కొనుగోలు చేయిస్తారా.. చూడాలి మరి.
తాజావార్తలు
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
-
Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
-
TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!