టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. అయోమయంలో తెలంగాణ రైతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు సరైన సమయంలో వర్షాలు కురియక రైతులు ఆందోళన చెందేవారు. ఒక్కోసారి అతి వర్షాలు కురిసి పంటకు నష్ట వాటిల్లేది. ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్న రైతులు ఎప్పుడూ వినని మాటలు రాజకీయ నాయకుల నోటి నుంచి వింటున్నారు. ఆ మాటలతో ఏం చేయాలో రైతులకు పాలుపోవడం లేదు. ఓ రాజకీయ పార్టీ అధినేత వరి వేస్తే ఊరే అంటే.. మరో రాజకీయ పార్టీ నేత వరి వేయండి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కొనిపిస్తానంటున్నారు.. ఇలా రాజకీయ పార్టీల నాయకులు సందేశాలతో తెలంగాణాలోని రైతులు అయోమయంలో పడిపోయారు.
అసలు విషయం ఏంటంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే యాసంగిలో వరి వేయకండి.. అలా వేస్తే మేము వరి ధాన్యం కొనుగోలు చేయం.. అని ఖరాఖండిగా చెప్పారు. కేసీఆర్ మాటలపై స్పందించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రైతులు వరి వేయండి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయమంటోంది.. అందుకే మీరు వరి వేయకండని సీఎం కేసీఆర్ అంటుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి చెందిన నాయకుడు వరి వేయండి మేము కొనుగోల్లు చేపిస్తామంటూ చేసే వాగ్దానాలపై ఎవరి మాటలు నమ్మాలో రైతులకు ఆర్థం కావడం లేదు. ఇప్పటికే వానాకాలంలో వరి ధాన్యం కొనుగోల్లు ఆలస్యమవుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
వానాకాలంలో పండించిన ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ సర్కార్ హామీ ఇచ్చినా.. యాసంగిలో వేయాల్సిన పంటలపై క్లారిటీ రాకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. ‘దున్నపోతు..దున్నపోతు.. పోట్లాడుకుంటే లేగదూడ కాలు విరిగినట్లు’ రాజకీయ పార్టీలు వారి లబ్దికోసం రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారనే భావన కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా రైతులు వచ్చే యాసంగిలో వరి మినహా వేరే పంటలు వేసుకోవాలని సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించి మరీ ఓ క్లారిటీ అయితే ఇచ్చారు… కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న.. బీజేపీ నేత బండి కేంద్రంతో వరి ధాన్యం కొనుగోలు చేయిస్తారా.. చూడాలి మరి.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?