తెలంగాణలో రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం నాటకలాడుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ అనుబంధ సంఘాలన్నిటితో సమావేశం జరిగిందని, ఈ రోజు డిజిటల్ మెంబర్షిప్ తో పాటు భూ వివాదాలపై పాదయాత్ర పై చర్చించాం అన్నారు మహేష్ కుమార్ గౌడ్.
భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్ర లోని సేవాగ్రాం వరకు పాదయాత్ర జరగనుంది. జనవరి 30 నుంచి పాదయాత్ర ను మీనాక్షి నటరాజన్ చేయనున్నారు. ఈ పాదయాత్ర లో ఒక్క రోజు రాహుల్ గాంధీ పాల్గొంటారు. తెలంగాణ లో భూ సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం లోని వాళ్లు ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారు. పేదలకు మాత్రం ధరణి పేరుతో వేధింపులకు గురి చేస్తోంది. నెల రోజులుగా ధాన్యం కళ్లాల్లో ఉంటే కొనుగోలు చేయడం లేదు.
టీ.ఆర్.ఎస్ , బీజేపీ నేతలు రాజకీయ డ్రామా చేస్తున్నారు.ధాన్యం కొనబోమని… లేఖ రాసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు డ్రామా లు చేస్తున్నారు.శనివారం, ఆదివారం ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందం.. తాజ్ మహల్ ను సందర్శించారా? వీళ్ల డ్రామా వల్ల రైతులు రూ.1400లకే క్వింటాలుకు ధాన్యం అమ్ముకున్నారు.ఈ కుంభకోణంలో సీఎం కేసీఆర్ కుంటుబ హస్తం ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్. 30 లక్షల ధాన్యం కొనుగోలు చేశామన్నది పచ్చి అబద్ధం అని ఆరోపించారు.