Pingali Venkaiah Jayanti: జాతీయ జెండా రూపకర్త తెలుగోడే..పతాకం డిజైన్ కోసం ఐదేళ్లు శ్రమ
- భారతదేశ త్రివర్ణ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య
- ఆయన జయంతి నేడు
- త్రివర్ణ పతాకాన్ని డిజైన్ చేయడానికి ఆయన కృషిని తెలుసుకుందాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ త్రివర్ణ పతాకం రూపకర్త ఎవరో తెలుసా? ఆయన తెలుగు జాతి రత్నమన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈరోజు (ఆగస్టు 2) మన ప్రియతమ త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి. పింగళి వెంకయ్య భారత జాతీయ జెండాను రూపొందించడానికి చాల కష్టపడ్డారు. త్రివర్ణ పతాకాన్ని డిజైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇందుకోసం పింగళి వెకైన్య ఐదేళ్లపాటు ప్రపంచవ్యాప్తంగా జాతీయ జెండాలపై అధ్యయనం చేశారు. దీని తరువాత ఆయన సుమారు 30 డిజైన్లను సమర్పించారు. వాటిలో త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా ఎంపిక చేశారు.
READ MORE: Instagram: ఇన్స్టాగ్రామ్ను నిషేధించిన ఆ దేశం..
Also Read
త్రివర్ణ పతాకం డిజైన్ ఎలా తయారు చేయబడింది?
భారతదేశ జాతీయ జెండాను సిద్ధం చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే దానిని తయారు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్కు చెందిన పింగళి వెంకయ్యకు చెందుతుంది. ప్రస్తుత కృష్ణా జిల్లా, మొవ్వ మండలం భట్లపెనుమర్రులో 1876 ఆగస్టు 02న ఆయన జన్మించారు. ఆయన తెలుగోడు కావడం మనకు గర్వకారణం. పింగళి వెంకయ్య స్వాతంత్ర్య సమరయోధుడు. వ్యవసాయ శాస్త్రవేత్త కూడా. నిజానికి కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదివిన వెంకయ్య మహాత్మా గాంధీని కలిశారు. భారతదేశానికి జెండా తయారు చేయమని గాంధీ స్వయంగా వెంకయ్యను అడిగారు గాంధీ.
READ MORE:KTR: తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడితే స్వాగతిస్తాం..
దీంతో వెంకయ్య 1916 నుంచి 1921 వరకు దాదాపు ఐదేళ్లపాటు ప్రపంచ దేశాల జెండాలను అధ్యయనం చేశారు. ఆయన భారత జెండా కోసం దాదాపు 30 డిజైన్లను సమర్పించారు. ఇందులో మొదటగా ఓ జెండాను ఎంపిక చేశారు. ఇందులో ఆకుపచ్చ, ఎరుపు రంగుల రెండు చారలు, జెండా మధ్యలో మహాత్మా గాంధీ యొక్క స్పిన్నింగ్ వీల్(రాట్నం) ఉన్నాయి. 1921లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తొలిసారిగా గాంధీని కలుసుకుని ఎరుపు, ఆకుపచ్చ రంగులతో తయారు చేసిన జెండాను చూపించారు.
READ MORE:Raai Laxmi : స్విమ్మింగ్ పూల్లో కళ్లు చెదిరే అందాలతో అదరగొట్టేసిన రాయ్ లక్ష్మీ
ఆ తర్వాత వెంకయ్య తయారు చేసిన గాంధీ చరఖా, రెండు గీతలతో కూడిన జెండా వాడుకలోకి వచ్చింది. కాంగ్రెస్ సమావేశాల్లో ఈ జెండాను ఉపయోగించడం ప్రారంభించారు. కాగా, జలంధర్కు చెందిన లాలా హంసరాజ్ వెంకయ్యను కలిసి జెండాకు సంబంధించి కొన్ని సూచనలు చేశారు. లాలా హంసరాజ్ జెండా మధ్యలో సర్కిల్ గుర్తును తయారు చేయాలని సూచించారు. ఈ జెండాలో శాంతికి చిహ్నంగా తెలుపు రంగును కూడా చేర్చాలని గాంధీ వెంకయ్యకు సూచించారు. అంటే త్రివర్ణ పతాకంలోని చక్ర క్రెడిట్ లాలా హంసరాజ్కి, తెలుపురంగు చేర్చిన ఘనత గాంధీకి దక్కుతుంది.
READ MORE:Intel Layoffs: 15,000 ఉద్యోగులను తొలగించిన ఇంటెల్..
భారత జెండా మారుతూ వచ్చింది. 1931లో కుంకుమ, తెలుపు, ఆకుపచ్చ రంగులతో తయారు చేసిన జెండాను కాంగ్రెస్ ఆమోదించింది. అయితే, ఇది వరకు జెండాలో అశోక చక్రం లేదు. కానీ అదే సంవత్సరంలో, త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరించే ప్రతిపాదన ఆమోదించబడింది. ఈ జెండా ప్రస్తుత త్రివర్ణ పతాకంతో సరిపోలింది. 16 ఏళ్లుగా కాంగ్రెస్తో సహా దేశవ్యాప్తంగా ఈ జెండాను ఉపయోగించడం కొనసాగింది. దీని తరువాత, రాజ్యాంగ సభ 21 జూలై 1947న ఈ జెండాను జాతీయ జెండాగా ఆమోదించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, దానిలో కేవలం ఒక మార్పు వచ్చింది. చరఖా స్థానంలో అశోక్ చక్ర చేర్చబడింది. ఇలా చాలా సార్లు జాతీయ జెండా మారుతూ వచ్చింది.
తాజావార్తలు
-
Andy Flower: ఇంగ్లండ్ కోచ్ పదవి వద్దు.. ఆర్సీబీనే ముద్దు!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
Bhagyashri Borse: వరుస ఫ్లాప్లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
-
AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?