సాగర్ ఎడమకాల్వ పరిధిని ఇష్టం వచ్చినట్లు పెంచేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 23న తెలంగాణ చీఫ్ ఇంజినీర్ మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో నందికొండ ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిపై కీలక అంశాలను పేర్కొన్నారు. 1952లో అప్పటి ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం ఉమ్మడిగా తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని… ఈ మేరకు ప్రాజెక్టు నివేదిక రిపోర్టును బేఖాతరు చేసి నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఇష్టా రీతిగా పెంచుకుంటూపోయారని ఆరోపించారు. హైదరాబాద్ రాష్ట్రం తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికలో ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు నందిగామ తాలుకాలో కట్లెరు వాగు వరకు మాత్రమే ప్రతిపాదించడం జరిగిందన్నారు. మద్రాసు రాష్ట్రంలో ప్రతిపాదించిన ఆయకట్టు 1.3 లక్షల ఎకరాలు మాత్రమే అని పేర్కొన్నారు.
Read Also: ఏపీకి రమ్మని సీఎం కేసీఆర్ను పిలిచిందెవరు?
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
- Greece: గ్రీస్లో ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా దగ్ధమైన యుద్ధ విమానం
1956లో రాష్ట్రాల పునర్విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టు నివేధికకు భిన్నంగా ఆంధ్ర ప్రాంతంలోని ఆయకట్టును 1.3 లక్షల ఎకరాల నుంచి 3.78 లక్షల ఏకరాలకు పెంచిందన్నారు. అదే సమయం లో తెలంగాణ ఆయకట్టును 6.6 లక్షల ఎకరాల నుంచి 6.02 లక్షల ఎకరాలకు తగ్గించిందని ఆరోపించారు. ఒక లక్ష ఎకరాలను లిఫ్ట్ పథకాల ద్వారా సాగులోకి తీసుకు రావాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదన్నారు. 53 వేల ఎకరాల ఆయకట్టును చిన్న చెరువుల కింద స్తిరీకరించాల్సి ఉండగా ఈ అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రెగ్యులేటర్ గేట్ కనీస మట్టాన్ని 13 మీటర్లు తగ్గించడంతో తెలంగాణ రాష్ట్రం చాలా ఆయకట్టును కోల్పోయిందన్నారు.
Read Also: కేసీఆర్ కామెంట్లకు సిగ్గుపడాలి.. మాజీ ఎంపీ కొనకళ్ళ
1969 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి నివేదిక కు అనుగుణంగా ఆధ్ర ప్రాంతంలో ఆయకట్టును 1.3 లక్షల ఏకరాలకు కుదిస్తూ ఆదేశాలు జారీ చేసిందని లేఖలో పేర్కొన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయంలో ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒప్పందం లేకపోవడంతో ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు 1954 ఉమ్మడి నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రాంతంలోని ఆయకట్టును కట్లెరు వాగు వరకు 1.3 లక్షల ఎకరాలకు పరిమితం చేయాలని కోరారు. జులై 15 గెజిట్ నోటిఫికేషన్లో షెడ్యూల్ 2లో పేర్కొన్న 4.8 నుంచి 4.14 వరకు ఉన్న అంశాలను తొలగించాలని కోరుతూ ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
-
Vitamin Deficiency: రాత్రంతా నిద్రపోయినా అలసటగా ఉందా? మీ శరీరంలో ఈ సమస్య ఉండొచ్చు.
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!