Sudan Crisis: సూడాన్లో కాల్పుల విరమణకు అంగీకారం.. ఇద్దరు జనరల్స్ మధ్య సంధి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూడాన్లో పోరాడుతున్న జనరల్స్ మూడు రోజుల కాల్పుల విరమణకు అంగీకరించారు. 10 రోజులు కొనసాగుతున్న పోరాటంలో వందల మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. విదేశీయుల సామూహిక వలసలను ప్రేరేపించింది. ఇద్దరు జనరల్స్ మధ్య వివాదం ప్రారంభమైనప్పటి నుండి కనీసం 427 మంది మరణించారు. 3,700 మందికి పైగా గాయపడ్డారు. గత 48 గంటలుగా జరిగిన తీవ్రమైన చర్చల తరువాత, సుడానీస్ సాయుధ బలగాలు (SAF), ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుండి 72 గంటల పాటు దేశవ్యాప్త కాల్పుల విరమణను అమలు చేయడానికి అంగీకరించాయి. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు.
రాజధాని ఖార్టూమ్ సహా దేశంలోని ఇతర చోట్ల యుద్ధాలు చేసిన ప్రత్యర్థుల మధ్య పోరాటం తరువాత సుడాన్ అగాధం అంచున ఉందని UN చీఫ్ హెచ్చరించిన తర్వాత ఇది జరిగింది.
Also Read:SRH vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్రైజర్స్ ఘోర పరాజయం
సుడాన్లో సైన్యం ప్రధానమంత్రి అబ్దల్లా హమ్డోక్ యొక్క ప్రభుత్వాన్ని తొలగించి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అనంతరం ఈ రెండు దళాలకు చెందిన నేతల మధ్య విభేదాలు ఈ సంక్షోభానికి కారణం అయ్యాయి. ఆర్మీ చీఫ్ అబ్దేల్ ఫత్తా అల్-బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో మధ్య తీవ్ర విభేదాలు, ఈ రెండు భద్రతా బలగాల మధ్య సూడాన్ దేశం రావణకాష్టంగా మారింది. దేశ సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరుగుతున్న ఘర్షణల్లో భాగంగా పోరాటం జరిగింది. రాజధాని ఖార్టూమ్, దాని పరిసరాలలో సూడాన్ సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య పోరు చెలరేగింది. దీంతో సూడాన్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నారు.
Also Read:BRS Party: నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభలు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
విద్యుత్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, నీరు, మందులు దొరక్క అల్లాడిపోతున్నారు. శనివారం ప్రారంభమైన విదేశీ-వ్యవస్థీకృత తరలింపులలో 4,000 మందికి పైగా దేశం నుండి పారిపోయారు. యునైటెడ్ స్టేట్స్ తోపాటు యూరోపియన్, మిడిల్ ఈస్టర్న్, ఆఫ్రికన్, ఆసియా దేశాలు తమ ఎంబసీ సిబ్బందిని సురక్షితంగా తీసుకురావడానికి అత్యవసర మిషన్లను ప్రారంభించాయి. కానీ లక్షలాది మంది సూడానీస్ పారిపోలేకపోతున్నారు. తాజాగా మరణించిన వారిలో ఖార్టూమ్లోని కైరో రాయబార కార్యాలయంలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ అటాచ్ కూడా ఉన్నారని ఈజిప్ట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. తరలింపు విధానాలను అనుసరించడానికి ఇంటి నుండి రాయబార కార్యాలయానికి వెళుతుండగా అధికారి హత్యకు గురయ్యారని పేర్కొంది. చాడ్, ఈజిప్ట్, దక్షిణ సూడాన్తో సహా పోరాట ప్రభావిత ప్రాంతాల నుండి కొంతమంది సుడానీస్ పౌరులు తప్పించుకోగలిగారని UN ఏజెన్సీలు పేర్కొన్నాయి.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..