సూడాన్లో జనరల్స్ మధ్య సాయుధ పోరాటం కొనసాగుతుండగా, ఆర్మీకి చెందిన అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్ కాల్పుల విరమణ పొడిగింపుకు ప్రాథమిక ఆమోదం ఇచ్చారు. సంధిని పొడిగించడానికి సైన్యం అగీకరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్లో వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల మరణాలు పెరుగుతాయని పేర్కొంది.
సూడాన్లో పోరాడుతున్న జనరల్స్ మూడు రోజుల కాల్పుల విరమణకు అంగీకరించారు. 10 రోజులు కొనసాగుతున్న పోరాటంలో వందల మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. విదేశీయుల సామూహిక వలసలను ప్రేరేపించింది.