ఒమిక్రాన్ వేళ.. తెలంగాణలో సదువులు సాగేనా..?
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. గత రెండు కరోనా వేవ్లతోనే ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో మరోసారి కరోనా రక్కసి విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాలకు పాకిన ఈ వేరియంట్ భారత్లోకి కూడా ఎంటరైంది. ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు భారత్లో పెరుగుతున్నాయి. అంతేకాకుండా మునిపటికంటే ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ వస్తోంది. కరోనా విజృంభనతో గత రెండు సంవత్సరాలుగా విద్యాసంస్థలు పూర్తిగా ప్రారంభం కాలేదు.

కొంత మంది ఆన్లైన్లో క్లాసులు వింటుంటే స్థోమతలేని వారు చేసేదేంలేక వారి పిల్లలను చదువుకు దూరంగా పెడుతున్నారు. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ తరువాత విద్యాసంస్థలు ప్రారంభించాయి. అంతేకాకుండా సిలబస్లో కూడా మార్పులు చేసింది. ఇప్పుడిప్పుడే విద్యాసంస్థలకు విద్యార్థులు కూడా పూర్తిగా హజరవుతున్న తరుణంలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూడడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో మరోసారి భయం నెలకొంది. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతుండటం, తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగించే విషయమే.
Also Read
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ

తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదు. అయితే తెలంగాణలోని పలు పాఠశాలల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు బయట పడుతుండడంతో పాఠశాలకు పిల్లలను పంపిస్తున్న తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. రెండు సంవత్సరాలుగా పిల్లలు చదువులకు దూరంగా ఉంటున్నారని.. ప్రభుత్వంపై నమ్మకంతో పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రులు.. ఇప్పుడు వెలుగులోకి వచ్చి ఒమిక్రాన్ వేళ.. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో పిల్లల సదువులు సాగేనా..? అని ఆలోచిస్తున్నారు.
తాజావార్తలు
-
UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
Toxic: యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!