PM Modi: పొంగల్ ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ జాతీయ స్ఫూర్తిని పొంగల్ ప్రతిబింబిస్తోందని.. కాశీ-తమిళ సంగమం, సౌరాష్ట్ర-తమిళ సంగమంలోనూ అదే భావోద్వేగ అనుబంధం కనిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి ఎల్.మురుగన్ నివాసంలో ఏర్పాటు చేసిన పొంగల్ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. తమిళనాడులోని ప్రతి ఇంట్లో పండుగ ఉత్సాహం కనిపిస్తోందని.. ప్రజలందరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, సంతృప్తి ఉండాలని ఆకాంక్షించారు.
How To Wake Up Early: చలికాలంలో ఉదయాన్నే లేవడం సమస్యగా మారుతుందా?.. ఈ చిట్కాలు పాటించండి..
Also Read
భారతదేశ వైవిధ్యాన్ని ‘కోలం’ (రంగోలి)తో సమం చేస్తూ.. దేశంలోని ప్రతి మూల ఒకదానితో ఒకటి మానసికంగా కనెక్ట్ అయినప్పుడు, దేశం బలం కొత్త రూపంలో కనిపిస్తుందని ప్రధాని అన్నారు. “2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు ఈ ఐక్యతా భావన అతిపెద్ద బలం” అని ప్రధాన మంత్రి అన్నారు. నేను ఎర్రకోట నుండి పిలుపునిచ్చిన పంచప్రాన్ యొక్క ప్రధాన అంశం దేశ ఐక్యతను శక్తివంతం చేయడం, బలోపేతం చేయడం అని తెలిపారు.
Milind Deora: “చాయ్వాలా ప్రధాని, ఆటో డ్రైవర్ సీఎం”.. కాంగ్రెస్ మాజీ నేత ప్రశంసలు..
సన్యాసి కవి తిరువల్లూరును ఉటంకిస్తూ.. దేశ నిర్మాణంలో విద్యావంతులైన పౌరులు, నిజాయితీ గల వ్యాపారులు, మంచి పంటల ప్రాముఖ్యతను ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. పొంగల్ సందర్భంగా కొత్త పంటను దేవుడికి సమర్పిస్తామని, ఈ పండుగకు ‘అన్నదాత రైతులు’ కేంద్రంగా నిలుస్తారని తెలిపారు. భారతదేశంలోని ప్రతి పండుగకు గ్రామం, పంట, రైతుతో అనుబంధం ఉంటుందని అన్నారు. మిల్లెట్స్ తమిళ సంప్రదాయాల మధ్య అనుబంధం ఆధారంగా గుర్తు చేసుకుంటూ.. ‘సూపర్ ఫుడ్ శ్రీ అన్న’ (మిల్లెట్స్) గురించి ‘కొత్త అవగాహన’ వచ్చిందని, చాలా మంది యువకులు మిల్లెట్లపై స్టార్టప్లను ప్రారంభించారని సంతోషం వ్యక్తం చేశారు. ముతక ధాన్యాలు పండించే మూడు కోట్ల మందికి పైగా రైతులు దీనిని ప్రోత్సహించడం ద్వారా నేరుగా లబ్ధి పొందుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా జాతి ఐక్యతను బలోపేతం చేసే సంకల్పానికి ‘మనల్ని మనం పునరంకితం చేసుకోండి’ అనే పిలుపుతో ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!