టీడీపీలో బుచ్చయ్య ఎపిసోడ్.. దేనికి సంకేతం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుదేశం పార్టీలోనే కాదు. యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం.. కాక పుట్టిస్తోంది. ఆయన వినిపిస్తున్న ధిక్కార స్వరం.. టీడీపీలో ఉన్న లుకలుకలను బయటపెడుతోంది. “పెదబాబు పట్టించుకోవడం లేదు.. కనీసం చినబాబు అయినా పట్టించుకోకపోతే ఎలా” అని ఆయన ప్రశ్నిస్తున్న తీరు.. తీవ్ర చర్చనీయాంశమవుతోంది. 2014లో టీడీపీ గెలవడానికి.. 2019లో ఓడిపోవడానికి దారి తీసిన కారణాలను సైతం.. తాజా పరిణామం చర్చలోకి తీసుకువస్తోంది.
కొన్నాళ్ల క్రితమే.. ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వీడియో ఒకటి లీక్ అయ్యింది. లోకేశ్ ను టార్గెట్ చేస్తూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు.. ఇప్పటికీ ప్రత్యర్థి పక్షాలకు ఆయుధంగా ఉపయోగపడుతున్నాయి. ఆ ఎపిసోడ్ చల్లారిపోతోందని అనుకునేలోపు.. బుచ్చయ్య ఎపిసోడ్ ఓపెన్ గా టాపిక్ అయిపోయింది. పార్టీలో సీనియర్ల మాటకు, అభిప్రాయాలకు విలువ లేదని ప్రజలు సైతం భావించే స్థితికి తీసుకువస్తోంది. దీనికి అంతటికీ కారణం.. చిన బాబే అన్న అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.
Also Read
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
- Trump-Iran: జోర్డాన్లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
- Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
ఎందుకంటే.. 2014లో.. ఎన్నికలకు వెళ్లినప్పుడు చంద్రబాబు కుడి, ఎడమ భుజాలుగా సీఎం రమేశ్, సుజనా చౌదరి వ్యవహరించారు. టికెట్ల కేటాయింపు నుంచి మొదలు పెట్టి చంద్రబాబు పాలసీలను ప్రజల్లోకి తీసుకెళ్లేవరకూ ప్రతీ విషయంలోనూ భాగం పంచుకున్నారు. తర్వాత.. టీడీపీ గెలిచింది. పాలనలో బాబు బిజీ అయ్యారు. మెల్లమెల్లగా కార్యకర్తలకు దూరమయ్యారు. ఇదే వేళ.. లోకేశ్ పరపతి పార్టీలో పెంచేలా కార్యాచరణ ప్రారంభమైంది. ప్రతి నిర్ణయంలో చినబాబు నిర్ణయాలకు ప్రాధాన్యత పెరగడం కొనసాగింది. కాలక్రమంలో.. కారణాలేవైనా సరే. సుజనా, రమేశ్ లాంటి నేతలు పార్టీని వీడి.. బీజేపీలో చేరిపోయారు. బాబు పాలసీని ఇంప్లిమెంట్ చేసేవాళ్లు తగ్గిపోయారు.
అలాగే.. 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం.. మంగళగిరిలో లోకేశ్ ఓటమి సైతం.. టీడీపీని కుంగదీశాయి. ఆ తర్వాత.. పార్టీని సీనియర్ నాయకులు వీడడం.. తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తూ రావడం.. ఇలాంటి తరుణంలోనూ లోకేశ్ కే ప్రాధాన్యత కొనసాగుతుండడం వంటి పరిణామాలు.. పార్టీని ఇక్కడివరకూ తీసుకువచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎంతగా వైసీపీపై వ్యతిరేకంగా ప్రచారం చేసినా.. చివరికి మెజారిటీ స్థానాలు అధికార పార్టీకే దక్కడం.. టీడీపీని మరింత కుంగదీసింది. ఇలాంటి తరుణంలోనే.. సీనియర్ల మాటలను పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని.. అందుకే.. ఇలాంటి పరిస్థితి టీడీపీకి దాపురించిందనీ.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేస్తున్న విమర్శలు.. జనాల్లోకి ఓ అభిప్రాయాన్ని తీసుకువెళ్తున్నాయి.
లోకేశ్ కు ప్రాధాన్యత ఇచ్చినా సరే.. గతంలో మాదిరిగా చంద్రబాబు నేరుగా పార్టీని పట్టించుకోవాలని.. సీనియర్ల మాటలకు.. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలకు విలువ ఇస్తూనే.. లోకేశ్ ను నాయకుడిగా ఎదిగేలా చేయాలని.. అలా చేస్తేనే.. రాబోయే ఎన్నికల్లో పార్టీ కాస్త బలపడి.. రాజకీయాల్లో నిలదొక్కుకోగలదని.. అంచనాలు వ్యక్తవుతున్నాయి. గోరంట్ల ఎపిసోడ్ ద్వారా.. టీడీపీలో ఉన్న స్పష్టమైన వాతావరణం బయటపడిందని.. ఇప్పటికైనా బాబు కాస్త రూట్ మార్చి గేర్ పెంచాలని.. ఆ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ నుంచి ఓ మెసేజ్ పాస్ అవుతోంది.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!