టీడీపీలో బుచ్చయ్య ఎపిసోడ్.. దేనికి సంకేతం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుదేశం పార్టీలోనే కాదు. యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం.. కాక పుట్టిస్తోంది. ఆయన వినిపిస్తున్న ధిక్కార స్వరం.. టీడీపీలో ఉన్న లుకలుకలను బయటపెడుతోంది. “పెదబాబు పట్టించుకోవడం లేదు.. కనీసం చినబాబు అయినా పట్టించుకోకపోతే ఎలా” అని ఆయన ప్రశ్నిస్తున్న తీరు.. తీవ్ర చర్చనీయాంశమవుతోంది. 2014లో టీడీపీ గెలవడానికి.. 2019లో ఓడిపోవడానికి దారి తీసిన కారణాలను సైతం.. తాజా పరిణామం చర్చలోకి తీసుకువస్తోంది.
కొన్నాళ్ల క్రితమే.. ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వీడియో ఒకటి లీక్ అయ్యింది. లోకేశ్ ను టార్గెట్ చేస్తూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు.. ఇప్పటికీ ప్రత్యర్థి పక్షాలకు ఆయుధంగా ఉపయోగపడుతున్నాయి. ఆ ఎపిసోడ్ చల్లారిపోతోందని అనుకునేలోపు.. బుచ్చయ్య ఎపిసోడ్ ఓపెన్ గా టాపిక్ అయిపోయింది. పార్టీలో సీనియర్ల మాటకు, అభిప్రాయాలకు విలువ లేదని ప్రజలు సైతం భావించే స్థితికి తీసుకువస్తోంది. దీనికి అంతటికీ కారణం.. చిన బాబే అన్న అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.
Also Read
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
ఎందుకంటే.. 2014లో.. ఎన్నికలకు వెళ్లినప్పుడు చంద్రబాబు కుడి, ఎడమ భుజాలుగా సీఎం రమేశ్, సుజనా చౌదరి వ్యవహరించారు. టికెట్ల కేటాయింపు నుంచి మొదలు పెట్టి చంద్రబాబు పాలసీలను ప్రజల్లోకి తీసుకెళ్లేవరకూ ప్రతీ విషయంలోనూ భాగం పంచుకున్నారు. తర్వాత.. టీడీపీ గెలిచింది. పాలనలో బాబు బిజీ అయ్యారు. మెల్లమెల్లగా కార్యకర్తలకు దూరమయ్యారు. ఇదే వేళ.. లోకేశ్ పరపతి పార్టీలో పెంచేలా కార్యాచరణ ప్రారంభమైంది. ప్రతి నిర్ణయంలో చినబాబు నిర్ణయాలకు ప్రాధాన్యత పెరగడం కొనసాగింది. కాలక్రమంలో.. కారణాలేవైనా సరే. సుజనా, రమేశ్ లాంటి నేతలు పార్టీని వీడి.. బీజేపీలో చేరిపోయారు. బాబు పాలసీని ఇంప్లిమెంట్ చేసేవాళ్లు తగ్గిపోయారు.
అలాగే.. 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం.. మంగళగిరిలో లోకేశ్ ఓటమి సైతం.. టీడీపీని కుంగదీశాయి. ఆ తర్వాత.. పార్టీని సీనియర్ నాయకులు వీడడం.. తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తూ రావడం.. ఇలాంటి తరుణంలోనూ లోకేశ్ కే ప్రాధాన్యత కొనసాగుతుండడం వంటి పరిణామాలు.. పార్టీని ఇక్కడివరకూ తీసుకువచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎంతగా వైసీపీపై వ్యతిరేకంగా ప్రచారం చేసినా.. చివరికి మెజారిటీ స్థానాలు అధికార పార్టీకే దక్కడం.. టీడీపీని మరింత కుంగదీసింది. ఇలాంటి తరుణంలోనే.. సీనియర్ల మాటలను పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని.. అందుకే.. ఇలాంటి పరిస్థితి టీడీపీకి దాపురించిందనీ.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేస్తున్న విమర్శలు.. జనాల్లోకి ఓ అభిప్రాయాన్ని తీసుకువెళ్తున్నాయి.
లోకేశ్ కు ప్రాధాన్యత ఇచ్చినా సరే.. గతంలో మాదిరిగా చంద్రబాబు నేరుగా పార్టీని పట్టించుకోవాలని.. సీనియర్ల మాటలకు.. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలకు విలువ ఇస్తూనే.. లోకేశ్ ను నాయకుడిగా ఎదిగేలా చేయాలని.. అలా చేస్తేనే.. రాబోయే ఎన్నికల్లో పార్టీ కాస్త బలపడి.. రాజకీయాల్లో నిలదొక్కుకోగలదని.. అంచనాలు వ్యక్తవుతున్నాయి. గోరంట్ల ఎపిసోడ్ ద్వారా.. టీడీపీలో ఉన్న స్పష్టమైన వాతావరణం బయటపడిందని.. ఇప్పటికైనా బాబు కాస్త రూట్ మార్చి గేర్ పెంచాలని.. ఆ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ నుంచి ఓ మెసేజ్ పాస్ అవుతోంది.
తాజావార్తలు
-
Yamaha Ethanol Bike: ఇథనాల్తో నడిచే యమహా బైక్ భారత్లోకి ఎప్పుడు? కంపెనీ కీలక ప్రకటన
-
Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
-
IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
-
White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?