ఏపీ దేవాదాయశాఖలో భయం లేదు.. భక్తి లేదా..?
దేవాదాయశాఖ పేరు వింటేనే పవిత్రభావం కలగాలి. కానీ.. అక్కడ జరగని అరాచకం లేదు. అలా జరగకుండా చూడాల్సిన ఉన్నతాధికారులు చోద్యం చూస్తూ కూర్చున్నారు. మహాఅయితే తూతూ మంత్రంగా మమ అనిపించేస్తున్నారు. క్రమశిక్షణ ఉండాల్సిన శాఖ కట్టుతప్పడానికి రాజకీయ అండదండలేనట. వివాదాస్పదంగా మారిన వారిపై చర్యలు తీసుకోవడానికి పైవాళ్లు జడిసే స్థాయిలో నేతల మద్దతును వీళ్లు కూడగట్టారట.
దేవాదాయశాఖలో తప్పు జరిగితే చర్యలు ఉండవ్!
Also Read
ఏపీ దేవాదాయశాఖ గాడి తప్పిందా? ఏదో ఒక గొడవ లేదా ఇంకేదో వివాదం.. అవినీతితో శాఖ పరువు బజారున పడుతోందా? ఉద్యోగులు తప్పుమీద తప్పులు చేస్తున్నా.. ఉన్నతాధికారులు కంట్రోల్ చేయలేకపోతున్నారా? ప్రస్తుతం ఈ విమర్శల సుడిలోనే చిక్కుకుంది దేవాదాయశాఖ. ఇటీవల జరిగిన పరిణామాలు శాఖ పనితీరును తెలియజేస్తున్నాయని ఉద్యోగవర్గాల ఓపెన్ టాక్. కొందరు ఉద్యోగుల తీరు ఎంత దారుణంగా ఉందో.. ఆ శాఖ ఉన్నతాధికారుల తీరు కూడా అంతే దారుణంగా ఉందని చెబుతున్నారు. తప్పు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ.. ఆ స్థాయిలో చర్యల్లేవ్. పైగా వెనకా ముందు ఆలోచించడం ఎక్కువైంది.
ఇసుక దాడిపై రాష్ట్రంలో చర్చ!
అధికారులను పిలిచి మందలించి పంపారు!
విశాఖలో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ల మధ్య ఇసుక దాడి సంచలనం సృష్టించింది. ఒక అధికారి ఛాంబర్లోకి ఇంకో అధికారి వెళ్లి ముఖాన ఇసుక కొట్టిన ఉదంతాలు ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడా ఘనత దేవాదాయశాఖకు దక్కింది. విశాఖ కేంద్రంగా సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ భూములకు సంబంధించి కీలక విచారణ జరుగుతోంది. అందరి దృష్టి ఆ వ్యవహరాలపై ఉండగా జరిగిన ఈ ఘటన ఆశ్చర్య పరిచింది. ఈ ఘటనలో తప్పు ఎవరిదనే విషయాన్ని తేల్చి.. చర్యలు తీసుకుంటే బాగుండేదనే భావన వ్యక్తమైంది. కానీ అలాంటిదేం లేకుండా.. వారిని కమిషనర్ ఆఫీస్కు పిలిచి.. మందలించి పంపేశారు. ఇదంతా టీ కప్పులో తుఫాన్ అనే రీతిలో ఉన్నతాధికారులు లైట్గా తీసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల డిపార్ట్మెంట్లో మరింతమంది నిర్లక్ష్యంగా ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోందట.
ద్వారకా తిరుమలలో ఏఈవో మృతిపై రగడ!
విశాఖ ఘటనపై చర్చ జరుగుతున్న సమయంలోనే పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల రగడ చర్చల్లోకి వచ్చింది. ఆలయ ఈవో అందరి ముందూ దూషించడం వల్లే ఏఈవో మనస్తాపం చెంది గుండెపోటుతో చనిపోయినట్టు ఆరోపణ. ఈవో తీరును తప్పుపడుతూ ఆలయ ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు. ఈ అంశంపైనా దేవాదాయశాఖలో చర్చ జరుగుతోంది. వాస్తవాలు ఏమైనా శాఖ కట్టు తప్పిందన్నది ఉద్యోగులు చెప్పేమాట.
చర్యలు తీసుకోవడానికి జంకుతున్న ఉన్నతాధికారులు?
చర్యలు తీసుకుంటారన్న భయం ఉద్యోగుల్లో పోయిందా?
తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు. హెచ్చరికలు పనిచేయడం లేదు. దీంతో ఏం చేసినా తమకేం కాదనే వారి సంఖ్య పెరుగుతోందట. కిందిస్థాయి ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడానికి జంకితే ఎలా అన్నది కొందరి ప్రశ్న. ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల అండతో పేట్రేగిపోతున్న సిబ్బందికి శాఖలో కొదవ లేదన్నది ఓపెన్ టాక్. తప్పు చేయడానికి వెనకాడటం లేదు. తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటారన్న భయం పోయింది. దీనికి ఒక్కరు కారణం అని అనలేం. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కొట్టగలం. దేవాదాయశాఖలో జరుగుతున్న పరిణామాలకు కూడా అదే కారణమట. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవాదాయశాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయలనే అభిప్రాయం కలుగుతోందట. అది సాధ్యమా? ఆ సాహసం ఎవరు చేస్తారు?
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!