సీడబ్ల్యూసీ భేటీ.. అసమ్మతి నేతలకు సోనియా వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశమైంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరుగుతోన్న ఈ భేటీలో వాడివేడిగా చర్చలు సాగుతున్నాయి.. పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, లఖింపూర్ ఖేరీ ఘటనపై చర్చిస్తున్నట్టు తెలుస్తుండగా.. ఈ సమావేశంలో 23 మంది అసమ్మతి నేతలకు సోనియా గాంధీ సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీడియాతో మాట్లాడితే సహించేది లేదని 23 మంది అసమ్మతి నేతలకు వార్నింగ్ ఇచ్చారు సోనియా గాంధీ.. అంతర్గత సమస్యలను పార్టీ సమావేశాల్లోనే చర్చించాలి హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షురాలిని తానేనని స్పష్టం చేవారు సోనియా గాంధీ.. పార్టీ వ్యవహారాలపై మీడియాకు ఎక్కితే సహించే ప్రసక్తేలేదనే నేతలను హెచ్చరించారు. ఎలాంటి సమస్యపై అయినా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.. కానీ, అంతర్గత సమస్యలను బహిర్గతం చేస్తే చూస్తూ ఊరుకోబోమని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. కాగా, ‘జీ-23’గా ఏర్పడిన కాంగ్రెస్ సీనియర్ నేతలు.. కొన్ని అంతర్గత సమస్యలపై పార్టీ అధినేత్రికి బహిరంగ లేఖలు రాయడం.. హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు అందరికీ ప్రత్యక్షంగా వార్నింగ్ ఇచ్చారు సోనియా.. డబ్ల్యూసీ సమావేశంలో ప్రారంభోపన్యాసంలో అనేక సమస్యలను లేవనెత్తారు కాంగ్రెస్ అధినేత్రి.. వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలను ఎండగట్టారు. ఇదే, సమయంలో.. అన్ని సమస్యలు వినేందుకు సిద్ధంగా ఉన్నా.. ఎలాంటి మోహమాటం లేకుండా అన్ని విషయాలపై మాట్లాడండి.. కానీ, అంతర్గత వ్యవహారాలపై రచ్చకెక్కొద్దని స్పష్టం చేశారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!