అక్కడ పాలు తాగేందుకే బార్లకు వెళ్తుంటారట…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా బార్లు అనగానే మనకు మద్యం గుర్తుకు వస్తుంది. మద్యం తాగేందుకు మందుబాబులు బార్లకు వెళ్తుంటారు. అనేక దేశాల్లో మద్యం ద్వారానే అధిక ఆదాయం సమకూర్చుకుంటారు. అయితే, ఆ దేశంలో కూడా బార్లు ఉన్నాయి. ఆ బార్లలో మద్యం అమ్మరు. మద్యం ప్లేస్లో పాలు అమ్ముతుంటారు. పాల కోసమే అక్కడి ప్రజలు బార్లకు వస్తుంటారు. అలాంటి దేశాలు కూడా ఉంటాయా అని షాక్ అవ్వకండి. ర్వాండా దేశ రాజధాని కిగాలీలో ఎక్కడ చూసినా మనకు బార్లు కనిపిస్తుంటాయి. ఈ బార్లలో తెల్లని చిక్కని పాలను అమ్ముతుంటారు. పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఈ బార్లకు వచ్చి రుచికరమైన పాలను తసుకుంటూ ఉంటారు. పాలు ఇప్పుడు ఆ దేశంలో ఒక భాగస్వామ్యం అయ్యాయి. పాలను తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పౌష్టికాహార లోపం నుంచి బయటపడొచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 1994వ సంవత్సరంలో ఆ దేశంలో జరిగిన మారణకాండలో దాదాపు 8 లక్షల మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది మేకలు, ఆవుల కాపర్లు ఉన్నారు. ఆ తరువాత ఆ దేశంలో పౌష్టికాహార లోపం తలెత్తింది. దీని నుంచి బయటపడేందుకు ఆ దేశం ప్రయత్నించింది. 2006 వ సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు పాల్ కగామే గిరింకా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలోని ప్రతి పేద కుటుంబానికి ఒక ఆవును ఇవ్వడం ప్రారంభించారు. ఈ కార్యక్రమం విజయవంతం అయింది. దేశంలో ఆవుపాలు పుష్కలంగా లభిస్తున్నాయి. మనలాగా అక్కడి ప్రజలు కాఫీలు, టీలు పెద్దగా తాగరు. పాలు మాత్రమే తాగుతారు. ఎక్కవగా చల్లని పాలను తీసుకోవడానికే ప్రజలు ఇష్టపడతారట.
Read: ఆయుధపోటీ ఇలానే కొనసాగితే… మరో ప్రచ్ఛన్నయుద్ధం తప్పదా?
Also Read
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!