అక్కడ పాలు తాగేందుకే బార్లకు వెళ్తుంటారట…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా బార్లు అనగానే మనకు మద్యం గుర్తుకు వస్తుంది. మద్యం తాగేందుకు మందుబాబులు బార్లకు వెళ్తుంటారు. అనేక దేశాల్లో మద్యం ద్వారానే అధిక ఆదాయం సమకూర్చుకుంటారు. అయితే, ఆ దేశంలో కూడా బార్లు ఉన్నాయి. ఆ బార్లలో మద్యం అమ్మరు. మద్యం ప్లేస్లో పాలు అమ్ముతుంటారు. పాల కోసమే అక్కడి ప్రజలు బార్లకు వస్తుంటారు. అలాంటి దేశాలు కూడా ఉంటాయా అని షాక్ అవ్వకండి. ర్వాండా దేశ రాజధాని కిగాలీలో ఎక్కడ చూసినా మనకు బార్లు కనిపిస్తుంటాయి. ఈ బార్లలో తెల్లని చిక్కని పాలను అమ్ముతుంటారు. పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఈ బార్లకు వచ్చి రుచికరమైన పాలను తసుకుంటూ ఉంటారు. పాలు ఇప్పుడు ఆ దేశంలో ఒక భాగస్వామ్యం అయ్యాయి. పాలను తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పౌష్టికాహార లోపం నుంచి బయటపడొచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 1994వ సంవత్సరంలో ఆ దేశంలో జరిగిన మారణకాండలో దాదాపు 8 లక్షల మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది మేకలు, ఆవుల కాపర్లు ఉన్నారు. ఆ తరువాత ఆ దేశంలో పౌష్టికాహార లోపం తలెత్తింది. దీని నుంచి బయటపడేందుకు ఆ దేశం ప్రయత్నించింది. 2006 వ సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు పాల్ కగామే గిరింకా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలోని ప్రతి పేద కుటుంబానికి ఒక ఆవును ఇవ్వడం ప్రారంభించారు. ఈ కార్యక్రమం విజయవంతం అయింది. దేశంలో ఆవుపాలు పుష్కలంగా లభిస్తున్నాయి. మనలాగా అక్కడి ప్రజలు కాఫీలు, టీలు పెద్దగా తాగరు. పాలు మాత్రమే తాగుతారు. ఎక్కవగా చల్లని పాలను తీసుకోవడానికే ప్రజలు ఇష్టపడతారట.
Read: ఆయుధపోటీ ఇలానే కొనసాగితే… మరో ప్రచ్ఛన్నయుద్ధం తప్పదా?
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
తాజావార్తలు
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..