ఈటెల, నేను చీకట్లో కలవలేదు: రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈటెలను రేవంత్రెడ్డి రహస్యంగా కలిశారన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో హాట్ టాపిక్గా మారాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక ముందు అధికార పార్టీ ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్షాలు డిఫెన్స్లో పడ్డాయి. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలకు ఆ రెండు పార్టీల నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఈటెల, తాను కలిసిన మాట నిజమేనన్నారు. అయితే తాము చీకట్లో కలవలేదని వివరణ ఇచ్చారు. ఈ ఏడాది మే 7న వేంనరేందర్రెడ్డి కొడుకు లగ్నపత్రిక సందర్భంగా గోల్కొండ రిసార్టుకు పలు పార్టీలకు చెందిన నేతలు వచ్చారని.. ఆ సమయంలో బహిరంగంగానే ఈటెల, తాము కలిశామని రేవంత్ తెలిపారు. ఈటెల తనను కలిసిన సమయంలో కేసీఆర్ చేసిన లంగా పనులన్నీ చెప్పారని పేర్కొన్నారు. చీకట్లో కలిసే అలవాటు కేసీఆర్ కుటుంబానికే ఉందన్నారు. ఈటెల రాజేందర్ను బీజేపీలో చేర్చుకోవడానికి కిషన్రెడ్డి వచ్చిన విమానం ఎవరిదో కేటీఆర్ చెప్పాలన్నారు. విమాన వివరాలు కేటీఆర్ చెప్తారా.. లేదా తనను బయట పెట్టమంటారో చెప్పాలని ప్రశ్నించారు.
Read Also: రేవంత్రెడ్డిని కలిశా.. అయితే తప్పేంటి?: ఈటెల రాజేందర్
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
- Greece: గ్రీస్లో ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా దగ్ధమైన యుద్ధ విమానం
హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలను ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకి లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడుదొంగలేనని.. ఇద్దరూ కలిసి పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. 20 ఏళ్లు జోడు గుర్రాల తరహాలో ఈటెల-హరీష్ రావు తిరిగారని, ఈటెల రాజేందర్ దేని కోసం కొట్లాడారో టీఆర్ఎస్ పార్టీ చెప్పాలన్నారు. ఈటెల అవినీతిపై విచారణ ఏమైందో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు, ఈటెలకు పడటం లేదని హరీష్ రావు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు ఎన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారో హరీష్రావు చెప్పాలని రేవంత్రెడ్డి సూటి ప్రశ్న వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు చెల్లని రూపాయి అని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ కేబినెట్లో ఉన్న 18 మంది మంత్రుల్లో ఒక్కరైనా మాదిగ ఉన్నారా అని ప్రశ్నించారు. మాదిగలు మంత్రులుగా పనికిరారా అని నిలదీశారు.
తాజావార్తలు
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్పై ప్రతీకారమే మిగిలింది..!
-
Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
-
ASUS Vivobook 14: ఆసుస్ వివో బుక్ 14, 15 భారత్లో లాంచ్.. Intel AI ప్రాసెసర్, 17 TOPS NPU, DDR5 RAM
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!