Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Restrictions On New Year Celebrations In Over All India

కొత్త సంవత్సరం వేళ ఆంక్షల గోల..!!

Published Date :December 28, 2021 , 10:23 pm
By Ramesh Nalam
కొత్త సంవత్సరం వేళ ఆంక్షల గోల..!!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మంగళవారం నాటికి భారత్‌లో కొత్తగా 6,358 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 653 మందికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. అంటే మొత్తం కేసులలో ఇది దాదాపు పది శాతం. ఒమిక్రాన్‌ సంక్రమించిన వారిలో 186 మంది కోలుకున్నారు.

కరోనా కేసుల్లో మహారాష్ట్ర మొదటి నుంచీ ముందున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒమిక్రాన్‌ విషయంలో ఆ రాష్ట్రమే అదే టాప్‌. మంగళవారం నాటికి కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య 167కు చేరింది. ఇక దాని తరువాత ఢిల్లీ 165 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాలపై సెకండ్‌ వేవ్‌ తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే.

Also Read

  • Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
  • Punjab: ‘‘పంజాబ్‌ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
  • Swati Maliwal: ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
  • Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం భేటీ

మరోవైపు కేరళలో ఇప్పటికీ అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 57 ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూశాయి. ఇక, తెలంగాణలో వాటి సంఖ్య 55కు చేరింది. కాగా గుజరాత్‌లో 49, రాజస్థాన్‌ 46, తమిళనాడు 34, కర్నాటకలో 31 చొప్పున ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయి. పెళ్లిళ్లు, పండుగ సీజన్ నేపథ్యంలో ఓమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దాంతో, గతంలో సడలించిన నిబంధనలను తిరిగి అమలు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయి.

ఇప్పటి వరకు వెలుగు చూసిన అన్ని వేరియంట్ల కన్నా ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోంది. సౌతాఫ్రికా, బ్రిటన్‌, డెన్మార్క్‌, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌ సహా యూరప్‌ దేశాలన్నీ దీని బారిన పడ్డాయి. డెల్టా వేరియంట్‌ ప్రభావం పూర్తిగా తొలగిపోక ముందే ఒమిక్రాన్‌ విజృంభణ వాటిని నిద్రకు దూరం చేస్తోంది. అయితే.. ప్రస్తుతం ఒమిక్రాన్‌ వ్యాప్తి తక్కువగా ఉన్న భారత్‌ వంటి దేశాలకు అవి గైడ్‌గా పనిచేస్తాయనటంలో సందేహం లేదు. మున్ముందు కేసులు భారీగా పెరిగినా పరిస్థితి అదుపు తప్పకుండా చూడవచ్చు. మన దేశంలో సెకండ్‌ వేవ్‌ ప్రారంభానికి ముందు ఈ దేశాలలో పరిస్థితి ఇప్పుడు ఉన్నట్టే ఉంది. కానీ భారత ప్రభుత్వం సెకండ్ వేవ్‌ హెచ్చరికలను పట్టించుకోలేదు. ఇప్పుడు మనం మళ్లీ సరిగ్గా ఆ పాయింట్‌ దగ్గరే ఉన్నాం. అందుకే ఈ జాగ్రత్తలు.

థర్డ్‌ వేవ్‌ని అడ్డుకోవాలంటే మొదట కేసులు పెరగకుండా చూడాలి. అలా జరగాలంటే ఆంక్షలు తప్పదు. అందుకే దేశ వ్యాప్తంగా మరోసారి ఆంక్షలు కఠినతరం అవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్‌లో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, అస్సం, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్, ఉత్తరాఖండ్‌, హర్యానాలో నైట్‌ కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. రాత్రి 10 లేదా 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. న్యూయర్‌ సెల్రబేషన్స్‌పై కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరిమితులు విధించాయి. కర్ఫ్యూ వేళల్లో వాహనాల రాకపోకలు, జన సంచారం నిషిద్ధం. ఎమర్జెన్సీసర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. అయితే ఈ గైడ్‌లైన్స్‌ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నాయి.

కేరళలో పెరుగుతున్న ఒమైక్రాన్ కేసులను కట్టడి చేసేందుకు డిసెంబరు 30వ తేదీ నుంచి జనవరి 2 వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అమలులో ఉంటుంది. అలాగే,న్యూ ఇయర్‌ వేడుకలపై ఒడిశా ప్రభుత్వం కూడా ఆంక్షలు విధించింది. జనవరి 2 వరకు పలు ఆంక్షలు అమలులో ఉంటాయి. కొత్త సంవత్సరం నాడు హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లు, పార్కులు, కన్వెన్షన్‌ హాళ్ల నిర్వహణపై ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించింది.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ విధిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒమిక్రాన్‌ కేసుల్లో తెలంగాణ నాల్గవ స్థానంలో ఉంది. మంగళవారం నాటికి 55 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఏపీలో ఆరు ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయి. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నందున జనం గుమికూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవల సూచించింది. దాంతో కొత్త సంవత్సరం వేళ ఆంక్షలు తప్పవని అంతా అనుకున్నారు. కానీ, కఠిన ఆంక్షలు ఉండవని తెలుస్తోంది. భౌతికం దూరం పాటిస్తూ మాస్కులు ధరించి ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ వంటి కోవిడ్‌ నిబంధనలను పాటిస్తే సరిపోతుంది.

అయితే జనవరి 2 వరకు బహిరంగ సభలు, ర్యాలీలను తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించకుంటే జరిమానా తప్పదు.కోవిడ్‌ ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు ఆదేశాలు వెళ్లాయి. జనవరి 2 తర్వాత ఓమిక్రాన్ కేసులపై సమీక్ష చేసి అవసరం అనుకుంటే మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

కొత్త సంవత్సరం వేళ కఠిన ఆంక్షలు విధిస్తే సర్కార్‌ రాబడి తగ్గుతుంది. డిసెంబర్‌ 31న ఒక్క రోజు మద్యం అమ్మకాల ద్వారా వెయ్యి కోట్ల ఆదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే ఏపీలో జగన్‌ సర్కార్‌ ఏం చేయబోతోందన్నది తెలియదు. రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో సోమవారం ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించడంతో పాటు నైట్‌ కర్ఫ్యూ విధించడంపై అధికారులతో చర్చించినట్టు సమాచారం.

మరోవైపు మొక్కబడి సమీక్షలతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సరిపెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్‌ నిర్లక్ష్యంతో కరోనా ఫస్ట్, సెకండ్‌వేవ్‌లో భారీ ప్రాణనష్టం జరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రభుత్వాస్పత్రులను మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోందని, ఒక్కసారిగా కేసులు పెరిగితే ఏం చేస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఏపీలో నూతన సంవత్సర వేడుకలపై కఠిన ఆంక్షలు విధిస్తారా? లేకపోతే తెలంగాణ బాటలో నడుస్తారా అనేది చూడాల్సి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Analysis
  • india
  • new year celebrations
  • Omicron Variant
  • Restrictions

తాజావార్తలు

  • Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!

  • LSG vs KKR: కోల్‌కతాపై పంజా విసిరిన మోసిన్ ఖాన్.. దంచికొట్టిన రింకూ.. లక్నో టార్గెట్ ఎంతంటే?

  • Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0” ప్రారంభం.!

  • IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..

  • Realme C100x: రియల్‌మీ C100x భారత్‌లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్‌ప్రైజ్!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions