Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Rbi Update Central Governament Renominated Four Independent Directors To Central Board Of Rbi

RBI Update: ఆర్బీఐలోకి ఆ నలుగురు మళ్లీ

Published Date :August 12, 2022 , 9:26 am
By Akkirala Kondala Rao
RBI Update: ఆర్బీఐలోకి ఆ నలుగురు మళ్లీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

RBI Update: కేంద్ర ప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) సెంట్రల్‌ బోర్డుకి నలుగురు స్వతంత్ర డైరెక్టర్లను మళ్లీ నామినేట్‌ చేసింది. సతీష్‌ కాశీనాథ్‌ మరాఠే, స్వామినాథన్‌ గురుమూర్తి, రేవతి అయ్యర్‌, సచిన్‌ చతుర్వేది.. పార్ట్‌ టైమ్‌, నాన్‌ అఫిషియల్‌ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. గురుమూర్తి, సతీష్‌ కాశీనాథ్‌లు నాలుగేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ పదవిలో కొనసాగుతారని, ఈ నియమకం గురువారం (నిన్నటి) నుంచి అమల్లోకి వచ్చినట్లు ఆర్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయ్యర్‌, సచిన్‌లు కూడా నాలుగేళ్లు ఈ పదవిలో కొనసాగుతారని, అయితే వాళ్లు ప్రస్తుతం ఉన్న పదవుల కాలం సెప్టెంబర్‌ 18న ముగిశాక ఈ నియామకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

‘గో’ ఫ్యూచర్‌ ప్లాన్‌

Also Read

  • Today Gold and Silver Prices: బంగారం ధరల మంటలు.. నేడు మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
  • Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
  • Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
  • Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!

బ్రాండెడ్‌ ఉమెన్స్‌ బోటమ్‌ వేర్‌ మార్కెట్‌లో దాదాపు 8 శాతం వాటా కలిగిన గో ఫ్యాషన్‌ ఇండియా లిమిటెడ్‌.. విస్తరణ ప్రణాళికలు రచిస్తోంది. ఏటా దాదాపు 120 నుంచి 130 వరకు కొత్త స్టోర్లను ప్రారంభించాలని భావిస్తోంది. గో కలర్స్‌ అనే బ్రాండ్‌ ప్రొడక్ట్‌లను విక్రయిస్తున్న ఈ సంస్థ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 24 కోట్ల రూపాయలకు పైగా లాభాలను ప్రకటించింది.

Vijayawada: ఫ్రీడం ఫైటర్స్‌ @ విజయవాడ. నగరం నలువైపులా వెల్లివిరుస్తున్న దేశభక్తి.

‘పవర్‌’ పెరిగింది

జులైలో దేశవ్యాప్తంగా విద్యుత్‌ వాడకం పెరిగింది. దీంతో పవర్‌ ప్లాంట్లకి 17 శాతం అధికంగా బొగ్గును సరఫరా చేయాల్సి వచ్చింది. డిమాండ్‌కి తగ్గట్లుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు 58 మిలియన్‌ టన్నులకు పైగా బొగ్గును వినియోగించారు. గత నెలలో బొగ్గు ఉత్పత్తి కూడా 11 శాతానికి పైగా పెరగటం విశేషం. 2022 జులైలో 54 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా ఈసారి 60 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి అయింది.

8 ఏళ్లలో డబుల్‌

2 వేల 30 నాటికి అంటే రానున్న ఎనిమిదేళ్లలో ఇండియా బ్రిటన్‌ మధ్య వాణిజ్యం రెట్టింపుకానుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, టెక్నాలజీలో పెట్టుబడులు, గ్లోబల్‌ సప్లై చైన్‌లో మార్పులు చేర్పులు, సులభతర వ్యాపార వాతావరణం ఇరు దేశాల వాణిజ్యాభివృద్ధికి దోహదపడనున్నాయి. బ్రిటన్‌ మీట్స్‌ ఇండియా రిపోర్ట్‌-2022లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఇండియా రికార్డ్‌

ప్రపంచంలోనే అత్యధిక డైలీ స్టార్టప్స్‌ రికగ్నైజింగ్‌ రేట్‌ కలిగిన దేశంగా ఇండియా ఘనత సాధించింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటున్న మన దేశంలో ప్రస్తుతం 75 వేల స్టార్టప్స్‌ ఉండటం విశేషం. మొదటి 10 వేల స్టార్టప్‌లకు ప్రభుత్వ గుర్తింపు రావటానికి ఏకంగా 808 రోజులు పట్టగా చివరి 10 వేల స్టార్టప్‌లకు కేవలం 156 రోజుల్లోనే రికగ్నిషన్‌ వచ్చింది. దీని ప్రకారం రోజుకి సగటున 80కి పైగా గుర్తింపు పొందాయి. ఇది ప్రపంచంలోనే అత్యధిక రేటు.

సబ్సిడీకి నో

886 మిలియన్‌ డాలర్ల సబ్సిడీ ఇవ్వాలన్న స్పేస్ఎక్స్‌ విజ్ఞప్తిని ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ తిరస్కరించింది. టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కి చెందిన ఈ సంస్థకి అమెరికాలోని దాదాపు ఆరున్నర లక్షల ప్రాంతాల్లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సర్వీసులు అందించేందుకు నిధుల అవసరం ఏర్పడింది. స్పేస్‌ఎక్స్‌కి అనుబంధంగా ఉన్న స్టార్‌లింక్‌ సంస్థ ఈ సర్వీసులపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవటం వల్లే సబ్సిడీని నిరాకరించినట్లు ఎఫ్‌సీసీ పేర్కొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • business news
  • go fashion
  • india-britain
  • indian startups
  • latest financial news

తాజావార్తలు

  • West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్‌కు ఆదేశం..

  • MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!

  • AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..

  • PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్

  • Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions