PM Kisan: రైతులకు శుభవార్త.. “పీఎం కిసాన్” నిధులు విడుదల
- రైతులకు శుభవార్త
- పీఎం కిసాన్ నిధులు విడుదల
- వారణాసిలో బటన్ నొక్కి విడుదల చేసిన ప్రధాని
- ఈ విడతలో 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడోసారి దేశంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా.. వారణాసిలో ఏర్పాటు చేసిన రైతుల సదస్సులో 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను విడుదల చేశారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి రూ.20,000 కోట్లను విడుదల చేశారు. ఈ విడతలో 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు క్రిడిట్ అవుతాయి.
Viral Video: అబ్బా ఏం ఐడియా బాసు.. ఇలా చేస్తే నెలల తరబడి కరివేపాకు ఫ్రెష్ గా..
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ఈ సందర్భంగా.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. పీఎం-కిసాన్ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలకు ఇప్పటికే రూ.3 లక్షల కోట్లకు పైగా నగదు బదిలీ చేసినట్లు తెలిపారు. “ఈరోజు, ప్రధాని మోడీ ఒకే క్లిక్తో దాదాపు 9.26 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 20,000 కోట్లను బదిలీ చేశారు. ఇప్పటివరకు దాదాపు రూ. 3.24 లక్షల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు” ఆయన తెలిపారు.
YS Jagan Pulivendula Tour: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన రద్దు..కారణమేంటంటే?
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2019 ఫిబ్రవరి 1న ప్రారంభించారు. దీని కింద ఇప్పటి వరకు 16 విడతల్లో రైతుల ఖాతాలకు నగదు బదిలీ అయ్యాయి. ఈ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతలుగా రూ.6000 అందజేస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలకు పంపుతారు. పీఎం కిసాన్ యోజన ప్రయోజనాలను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. కృషి సఖిగా శిక్షణ పొందిన 30,000 పైగా స్వయం సహాయక సంఘాలకు పారా ఎక్స్టెన్షన్ వర్కర్లుగా పని చేసేందుకు సర్టిఫికెట్లను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేశారు. తద్వారా వారు పారా-ఎక్స్టెన్షన్ వర్కర్లుగా పని చేయవచ్చు.. వ్యవసాయంలో తోటి రైతులకు సహాయం చేయవచ్చు.
తాజావార్తలు
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!