PM Modi: పీఎం మోడీజీ.. ఈ రోడ్డు మీరు ప్రారంభించిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఒక వైపు వరుణ దేవుడు, మరో వైపు వరుణ్గాంధీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని కల్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ లేటెస్టుగా ఉత్తరప్రదేశ్లో ప్రారంభించిన బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే పైన ఐదు రోజులకే పెద్ద గండి పడింది. దీంతో దానికి ఏం సమాధానం చెప్పుకోవాలో కమలదళానికి అర్థంకానివిధంగా తయారైంది. డ్యామేజ్ అయిన ఈ రోడ్డు ఫొటోని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ నిన్న ట్విట్టర్లో పెట్టి నానా హడావుడి చేశారు. మోడీజీ మీరు ప్రారంభించిన రోడ్డు ఐదు రోజుల వానకే గట్టిగా నిలబడలేకపోయింది అంటూ ఆయన విమర్శించటం సంచలనంగా మారింది.
రహదారి నిర్మాణ పనుల్లో ఎంత నాణ్యత పాటిస్తున్నారో చూడండి అని వరుణ్ గాంధీ ఏకంగా ప్రధానమంత్రినే ఎద్దేవా చేయటం చర్చకు దారితీసింది. ఈ ఎక్స్ప్రెస్ వేని 15000 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు. 296 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ రహదారిపై జలౌన్ జిల్లా దగ్గరలోని ఛిరియా సాలెంపూర్ ప్రాంతంలో పెద్ద పెద్ద గోతులు పడ్డాయి. దీంతో ఈ రోడ్డు పనులను నాసిరకంగా చేపట్టిన అధికారుల పైన, కంపెనీల పైన చర్యలు తీసుకోవాలని వరుణ్గాంధీ కోరారు.
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
- West Bengal: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్.. టీఎంసీ సర్కార్ బర్తరఫ్..
read more: Bhagyanagar Ganesh Utsav Samithi: తగ్గేదే లే… హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేసి తీరుతాం..
దీనిపై అధికారులు స్పందిస్తూ గుంతలను వెంటనే పూడ్చివేశామని, ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అనుమతించామని చెప్పారు. ఈ రోడ్డు విషయంలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల నాణ్యత ఏంటో దీన్నిబట్టి తెలిసిపోతోందని, ఏ మేరకు అవినీతి జరిగిందో గమనించాలని అన్నారు. ఏడు జిల్లా గుండా వెళ్లే ఈ నాలుగు లేన్ల రహదారిని ప్రధాని మోడీ ఈ నెల 16న ప్రారంభించారు.
ఉత్తరప్రదేశ్లోని కాంగ్రెస్ నేతలు సైతం ఈ ఘటనను ప్రస్తావిస్తూ బీజేపీని టార్గెట్ చేశారు. బీజేపీ నాయకులు రాష్ట్రంలోని తమ పాలనకు వంకలు పెట్టే పనేలేదంటూ గొప్పలు చెప్పుకుంటారని, ఈ రహదారి మొత్తం లోటుపాట్లమయంగా మారిందని విమర్శించారు. ఈ ఎక్స్ప్రెస్ వేని ఫాస్ట్, స్మూత్ ట్రాఫిక్ కారిడార్ అని చెప్పుకోవటానికి కమలనాథులకు నైతిక అర్హత లేదని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం